రేపటి నుండే థియేటర్లు ఓపెన్... శుభారంభం ఇస్తాయా ?

VAMSI
ఈ కరోనా సమయంలో ఓ వైపు ప్రాణ భయం, మరో వైపు ఆర్థిక కష్టాలు, కనీసం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వీటన్నిటితో పాటు థియేటర్స్ క్లోజ్ అవడంతో ప్రజలకు ఎంతో వినోదాన్ని పంచే తమ అభిమాన తారల సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఇవన్నీ తోడై చాలా మందిలో మానసిక ఒత్తిడి పెరిగింది. మరో వైపు డిస్ట్రిబ్యూటర్స్ కూడా తీవ్రంగా నష్ట పోయారు. అయితే ఈ అంశాన్ని పలు మార్లు డిస్ట్రిబ్యూటర్స్, సినీ కార్మికుల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వద్ద విన్నవించగా, అందుకు స్పందించిన ప్రభుత్వం కరోనా తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో థియేటర్లకు అండగా నిలబడేందుకు సినిమా హాళ్లు పూర్తి హామీ ఇవ్వడంతో ఈ ఆదివారం నుండి థియేటర్స్ తిరిగి పునఃప్రారంభించాలని థియేటర్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ అదే విధంగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కలసి డిసైడ్ అయ్యారు.
 
దాంతో ఫ్యాన్స్ కు లడ్డూ లాంటి వార్తను అందించింది  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.  ఈ ఆదివారం నుండి రాష్ట్రంలో  సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేయాలని డిసైడ్ చేసింది రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్. ఈ నెల 23 నుంచి థియేటర్లలో నూతన సినిమాలు సందడి చేయనున్నాయి. 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో  రేపటి నుంచి మళ్లీ అన్ని థియేటర్లు పూర్వ వైభవం పుంజుకుని కళకళలాడనున్నాయి. అయితే కరోనా నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రాలన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాలా అన్న ప్లానింగ్ సంసిద్ధం చేసుకుంటున్నాయి.

అయితే చాలా కాలం తరువాత సినిమాలు థియేటర్ లలో సందడి చేయనుండడంతో ఆశించిన ఆరంభాన్ని అందిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. ఎప్పటి లాగే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారా లేదా కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న భయంతో నిర్మాతలకు షాక్ ఇస్తారా తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పేలా లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: