దృశ్యం డైరెక్టర్ కి బంపర్ ఆఫర్... ?

VAMSI
ఇండియన్ సినిమా చరిత్రలో వివిధ జోనర్ లలో సినిమాలు చేస్తూ మన డైరెక్టర్స్ భారతదేశ ఖ్యాతిని రెట్టింపు చేస్తుంటారు. అయితే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో రకమైన సినిమాలను చేయడంలో సిద్దహస్తులై ఉంటారు. కామెడీ, లవ్, సెంటిమెంట్, హార్రర్, పాట్రియాటిక్, ఫ్యామిలీ ఎంటెర్టైనర్స్, యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ ఇలా ఎన్నో రకాల జోనర్ లలో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. పై జోనర్ సినిమాలన్నింటికీ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇందులో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకుడు ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటాడు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో ముఖ్యంగా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోతే ప్రేక్షకులు నిరాశపడడం ఖాయం. అయితే అతి కొద్ది మంది మాత్రమే మంచి కథను ఎంచుకుని అంతే చక్కగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసి, విజయాన్ని అందుకుంటూ ఉంటారు. వారిలో ఒక్కరే మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్. ఇతను మొదటి నుండి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నే డైరెక్ట్ చేస్తూ వచ్చాడు. ఇతను తీసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల మెప్పు పొందినవే.

అయితే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్శించింది మాత్రం "దృశ్యం" సినిమాతో, మోహన్ లాల్ మరియు మీనా ప్రధానపాత్రల్లో నటించారు. ఇదే సినిమాను తరువాత తెలుగు, తమిళ్ లో కూడా రీమేక్ చేశారు. అవి కూడా మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం దృశ్యం సీక్వెల్ మూవీ తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే జీతూ జోసెఫ్ కి తెలుగులో మరో సినిమా అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. దృశ్యం తెలుగు రీమేక్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు జీతూ జోసెఫ్ డైరెక్షన్ శైలి నచ్చి మరో అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కథను సిద్ధం చేయమని జోసెఫ్ కి చెప్పారని సమాచారం. దీనికి జోసెఫ్ కూడా అంగీకరించారని భోగట్టా.

అయితే ఈ కథ ఎవరికోసం అనేది ఇంకా తెలియలేదు. ఇప్పటికే వెంకటేష్ దృశ్యం , దృశ్యం 2 రెండు సినిమాలను చేయగా, మూడో సారి అతనితో చేస్తారా ? లేదా రానా ఇందులో నటిస్తారా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: