నాచురల్ స్టార్ నాని తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. తనదైన నటన, డైలాగ్స్తో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ నాచురల్ స్టార్ బిరుదును అందుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు ఎంచుకుంటూ అందరినీ ఎంతగానో అలరిస్తున్నాడు. ప్రతి సినిమాతో ప్రేక్షకులను తనదైన రీతిలో మెప్పిస్తూ స్టార్ హీరో అనిపించుకున్నాడు. నాని సినిమా అంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్లి చూడకపోయినా పక్కా చూస్తారు. అయితే కరోనా కారణంగా నాని సినిమాలు కాస్త లేట్ అవుతున్నాయి. కరోనా మొదటి వేవ్ సమయంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్గా వచ్చిన ‘వీ’ బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాని నుంచి మరో సినిమా రాలేదు.
అయితే ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఇప్పటికే ‘టక్ జగదీశ్’ విడుదలకు సిద్దంగా ఉంది. కానీ ఆ సినిమా విడుదలకు కరోనా సెకండ్ వేవ్ బ్రేకులు వేసింది. దాని తరువాత ‘శ్యామ్ సింగరాయ్’ దాదాపు పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక నానీకి మిగిలి ఉంది ఒకే ఒక్క సినిమా అది ‘అంటే సుందరానికి’. దాంతో నాని కొత్త ప్తాన్ చేశాడట. కొత్తగా మరో మల్టీస్టారర్ సినిమా చేయాలని నాని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. శర్వానంద్తో కలిసి ఈ మల్టీస్టారర్ చేయాలని నానీ చూస్తున్నాడట. ఇందుకోసం శర్వాను కూడా కలిశాడని, ఈ సినిమాకు శర్వా కూడా ఓకే అన్నాడని, కానీ ముందు తాను చేస్తున్న సినిమాలు పూర్తి చేయాలని అన్నాడట. ఈ మేరకు వార్తలు సినీ సర్కిల్స్తో తెగ వినిపిస్తున్నాయి.
శర్వాతో నాని చేద్దామని చూస్తున్న సినిమాకు లైన్ కూడా నాని ఆలోచించాడట. ఒక మెకానిక్ కథ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందట. ఈ లైన్పై పూర్తి స్క్రిప్ట్ను నాని రెడీ చేయిస్తున్నాడని కూడా టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరైనా ప్రకటించాల్సి ఉంది. మరి వారి నుంచి త్వరలో ఏమైనా ప్రకటన వస్తుందేమో వేచి చూడాలి.