కృష్ణ అభిమానిగా ఎంట్రీ... మహేష్ బాబుకి పీఆర్వోగా మారి!
కృష్ణతో పాటు మహేష్ బాబుకి అభిమానిగా మారిన ఆయనకి సీనియర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్తో మంచి అనుబంధం ఉంది. కృష్ణ కుటుంబంలో అందరు హీరోల సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. వారితో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జునతో పాటు ఎంతో మంది సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి పని చేశారాయన. బీఏ రాజు చాలా కాలం నుంచి మహేశ్ బాబుకు పీఆర్ఓగా పని చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన మరణవార్త తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నారు స్టార్ హీరో మహేష్ బాబు.
ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ కూడా చేశారు. ‘బీఏ రాజు గారి మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నప్పటి నుండి తెలుసు. మేమిద్దరం చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు. . సినిమాల విషయంలో రాజు అంచనాలు, విశ్లేషణ చాలా కచ్చితంగా ఉంటుందనే నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది. అలాగే ఏ సినిమాను ఎప్పుడు ఏ దర్శకుడు ఏ హీరోతో నిర్మించారు.. ఆ బ్యానర్ ఏమిటి… రిలీజ్ డేట్ ఏమిటి… అది ఏ ఏ సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది లాంటి వివరాలను, విశేషాలను ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన ఏకైక వ్యక్తి బీఏ రాజు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.