రౌడీ హీరోతో మహేష్ హీరోయిన్ ?

KISHORE
ఇండస్ట్రీ కి పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే స్టార్స్ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్క సారిగా టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మరి యువ హీరోలందరికి షాక్ ఇచ్చాడు. విజయ్ ఎంట్రీ తో నిఖిల్, నితిన్, నాగశౌర్య, వంటి హీరోలు అతని తర్వాతి స్థానాలకు పడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు యూత్ లో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ హీరో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో " లైగర్ " అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ తరువాత కూడా విజయ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్లో పెట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నట్లు విజయ్ గతంలోనే అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ తోనే ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ ఏర్పడింది. హీరోలను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే సుక్కు, విజయ్ ని ఎలా చూపిస్తాడో అని అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాను పిరియడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడట సుకుమార్. ఇక ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన " 1నేనొక్కడినే " సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత నాగ చైతన్య తో " దోచేయ్ " సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ గా నిలవడంతో, తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్ చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం నేషనల్ స్టార్ ప్రబాస్ " ఆది పురుష్ " మూవీలో సీతగా నటిస్తుంది. ఇప్పుడు విజయ్-సుక్కు కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కృతి సనన్ ఫిక్స్ అయితే మాత్రం తెలుగులో కూడా ఈ అమ్మడు ఫుల్ బిజీ కావడం ఖాయం.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: