"వి" ప్లాప్ తర్వాత ప్లాన్ భారీగానే ఉందట ... ?

VAMSI
గ్రహణం సినిమా తో డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తన తొలి చిత్రం తోనే మంచి గుర్తింపు పొంది నంది పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అష్టా చమ్మా, అంతకు ముందు ఆ తర్వాత, సమ్మోహనం, జెంటిల్ మన్ , అమీ తుమి, వి వంటి చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హీరో సుదీర్ బాబుతో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబో లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. 'సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడం విశేషం. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ సంచలనముగా మారిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి అక్కినేని వారసుడు నాగచైతన్య తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు చిత్ర సీమలో వార్తలు వినిపించాయి. కానీ దాని గురించి ఎటువంటి ప్రకటన రాకముందే, చైతూతో సినిమా తర్వాత హీరో శర్వానంద్ తో మరో సినిమాకి ఇంద్రగంటి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆడాళ్లు మీకు జోహార్లు .. మహాసముద్రం  ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్, ఇంద్రగంటి చెప్పిన కథ నచ్చడంతో నా  నెక్ట్స్ ప్రాజెక్టు మీతోనే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంద్రగంటి చెప్పిన కాన్సెప్ట్ ఇది వరకు ఎప్పుడూ శర్వానంద్ చేయలేదని, అలాంటి పవర్ ఫుల్ పాత్రలో శర్వానంద్ ను ప్రెజెంట్ చేసేందుకు కథను మరింత బలంగా సిద్దం చేస్తున్నాడట ఇంద్రగంటి. అయితే ఇది ఎంతవరకు నిజమో , ఆ స్టోరీ లైన్ ఏమిటో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ క్లారిటీ రాదు. కాగా అటు ఇంద్రగంటి ఇటు శర్వానంద్ ఇద్దరికీ ఒక మంచి హిట్ అవసరం. రీసెంట్ సినిమా శ్రీకారం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో శర్వానంద్ తరువాత ప్రాజెక్టులపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: