సెలెక్షన్ లో ప్రభాస్ తరువాతే ఎవరైనా...?

Satya
ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ అని చెప్పాలి. ఆయన తెలుగు సీమను దాటిపోయి చాలా కాలమే అయింది. పైగా బాలీవుడ్ లో ప్లాట్ కూడా కొనుక్కుని పక్కా బాలీవుడ్ స్టార్ కూడా అయిపోయాడు. ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తులో ఇపుడు కనిపిస్తున్నాడు.
టాలీవుడ్ అనే చెరువు నుంచి పాన్ ఇండియా అంటే సముద్రంలోకి వెళ్లాక ప్రభాస్ అందరి వాడు అయ్యాడు. అక్కడ ప్రభాస్ అన్నింటికీ అతీతంగా ఉంటున్నాడు. అతని నటన చూసి మాత్రమే ఫ్యాన్స్ ఏర్పడుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ హవా ఇపుడు ఎలా ఉంది అంటే ఆయన పిలిస్తే క్యూ కట్టే మేకర్స్ చాలా మంది ఉన్నారు. ప్రభాస్ ఇమేజ్ ని తమ టాలెంట్ తో మిక్స్ చేసి సెల్యూలాయిడ్ మీద మ్యాజిక్ చేయడానికి రెడీ అంటున్న వారు ఎందరో ఉన్నారు.
అయితే ప్రభాస్ మాత్రం చాలా కూల్ గా తన సినిమాల సెలెక్షన్ చేస్తున్నాడు. పొరుగునే ఉన్న కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా స్టార్ట్ చేసి ప్రభాస్ తన   మార్క్ ఏంటో చూపించాడు. ఈ మూవీ మీద అందరి కళ్ళూ ఉన్నాయి. పైగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చాలా మంది అనుకుంటున్న వేళ ప్రభాస్ ఆయన్ని తల వైపునకు లాగేశారు. ఇక మరో విశేషం ఏంటి అంటే ఎక్కడ టాలెంట్ ఉంటుందో చూసి మారీ అలాంటి డైరెక్షన్లను ప్రభాస్ ఏరుకుంటున్నాడు.
ఈ లెక్కలో ఆయన కన్ను ఇపుడు తమిళ్ టాప్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన లోకేష్ కనగరాజు మీద పడింది. అంతే అతనితో కాంబో అంటున్నాడు. ఇక టోటల్ ఇండియాలో వారూ వీరూ అన్న తేడా లేకుండా హిట్లు వరసగా ఇస్తూ తన సత్తా చాటుకుంటున్న న్యూ టాలెంటెడ్ యంగ్ బ్లడ్ కి ప్రభాస్ అవకాశాలు ఇస్తున్నాడు అంటున్నారు. మరి ప్రభాస్ సెలెక్షన్ బాగుంది. బాక్సాఫీస్ వద్ద అది ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: