చిరంజీవి తన 153 వ సినిమాను మొదలు పెట్టేశారుగా!

Divya

చిరంజీవి తన రాజకీయ జీవితం ముగించుకున్న తరువాత తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత తన 151వ చిత్రంగా సైరా సినిమాలో చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు సరికొత్తగా  గోవింద ఆచార్య సినిమా మరో సంచలనాన్ని సృష్టించబోతోంది అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా గోవింద ఆచార్య విడుదల అవ్వక ముందే తన 153 వ చిత్రాన్ని చిరంజీవి ప్రకటించేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే  మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్,సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో పాటు ఎన్.వి.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మోహన్ రాజా దర్శకత్వంలో, ఆర్.బి.చౌదరి, ఎన్. వి. ప్రసాద్ నిర్మించనున్న చిరంజీవి 153వ చిత్రం లూసిఫర్ 2. ఇక ఈ సినిమా లూసిఫర్ సినిమా నుంచి రీమేక్ చేయబడ్డది.అయితే ఈ సినిమా జనవరి 20 2021బుధవారం ఉదయం సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు  అయిన ఆర్.బి.చౌదరి, ఎన్. వి.ప్రసాద్ లు  మాట్లాడుతూ.. వచ్చే ఫిబ్రవరి నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. మన ప్రాంతానికి తగ్గట్టుగా, మన ఆలోచనలను సరికొత్తగా రూపుదిద్దుతూ  అత్యద్భుతంగా స్క్రిప్ట్ ను  ఎవరూ ఊహించని రీతిలో దర్శకుడు మోహన్ రాజు సిద్ధం చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి పోతుంది "అని  వారు పేర్కొన్నారు.
ఇక అలాగే దర్శకుడు మోహన్ రాజు మాట్లాడుతూ" మెగాస్టార్ చిరంజీవి గారి తో సినిమా తీసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చిరంజీవి గారి అభిమానులకు ఎలాంటి అసంతృప్తి కలగనివ్వకుండా, ఆయన స్థాయికి తగ్గట్టుగా ప్రేక్షకులను అబ్బురపరిచే లాగా సినిమా ఉంటుంది. అయితే ఇప్పుడు తీయబోయే కథ మాత్రం విభిన్నంగా ఉంటుంది. లూసిఫర్ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాను పూర్తిగా రీమేక్ చేయడం లేదు. లూసిఫర్ కథ ఆధారంగా మెగా స్టార్ ఇమేజ్ కు  తగ్గట్టుగా ఈచిత్రం ఉండబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులను త్వరలోనే వెల్లడిస్తాం" అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: