మహేష్ బాబు తో మహర్షి - 2 .... ప్రకటనే తరువాయి ....??

GVK Writings

మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి. రెండేళ్ల క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి తొలిసారిగా మహేష్, వంశి ల కలయికలో సక్సెస్ఫుల్ సినిమాగా నిలిచింది. మహేష్ బాబు రిషి అనే పాత్రలో నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందించాడు. మహేష్ బాబు కెరీర్ 25వ మూవీ గా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక దీని తరువాత మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఇటీవల తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ తోనే ఉంటుంది అంటూ స్వయంగా రాజమౌళి కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి సర్కారు వారి పాట పూర్తి అయ్యేలోగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక సినిమా కూడా చేయనున్నారని, రాజమౌళితో తన మూవీ ప్రారంభం కావడానికి మరింత సమయం పడుతుందని భావించిన మహేష్ ఈలోపు మరొక సినిమా చేయడానికి డిసైడ్ అయినట్లు టాక్. ఇక రెండు రోజుల క్రితం సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగివచ్చి మహేష్ కి వంశీ పైడిపల్లి ఒక అద్భుతమైన స్టోరీ ని వినిపించారని, కాగా అది మహర్షి కి సీక్వెల్ అయిన పార్ట్ 2 మూవీ స్టోరీ అని అంటున్నారు. ఇక ఈ మూవీ స్టోరీ ఎంతో నచ్చిన మహేష్, త్వరలో దానిని పట్టాలెక్కిద్దాం వేగవంతంగా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని అన్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం మరొక్కసారి మహేష్, వంశీ ల కలయికలో మరొక సూపర్ హిట్ వచ్చినట్లే అంటున్నారు ప్రేక్షకాభిమానులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: