వైష్ణవ్ తేజ్ కి మళ్ళీ ముట్టజెప్పారే.. మైత్రి కొత్త ట్రెండ్ సృష్టిస్తుందా..?

P.Nishanth Kumar
సినిమా ఇండస్ట్రీ లో ఎలా ఉంటుందంటే సినిమా హిట్ అయితే ఒక లెక్కా.. లేకపోతే ఒక లెక్కా..అన్నట్లు ఉంటుంది. సినిమా హిట్ అయితే హీరో కి ఎవరికీ రానంత పేరు వస్తుంది. లేదంటే అదే హీరో కి ఎవరికీ రానంత చెడ్డ పేరు కూడా వస్తుంది. కానీ నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు గమనించరు.. హీరో కి పేరు అటు ఇటు అవుతుంది కానీ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత పరిస్థితి వేరేలా ఉంటుంది. పెట్టిన పెట్టుబడి సగం కూడా రాని పరిస్థితులు చాలా ఉన్నాయి.  అదే హిట్ అయితే అదే హీరో తో మరో సినిమా చేయడానికి కూడా రెడీ అవుతారు.
కొన్ని తరాలనుండి సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత కి నష్టం చేకూరితే రెమ్యూనరేషన్లో కొంత భాగం డబ్బును తిరిగి  ఇచ్చిన హీరోలను చాలామందిని మనం చూసాం.. కానీ లాభాలు వస్తే హీరోలకు ఎక్కువ డబ్బు ఇచ్చిన దాఖలాలు ఎక్కువగా కనిపించవు. ఒక హీరో తో ఒక సినిమా చేశాక లాభాలు వస్తే ఆ హీరోకి ముందు మాట్లాడుకున్నట్లే ముట్టజెవుతారు.. కానీ మైత్రి సంస్థ ఆ పద్ధతి ని బ్రేక్ చేసింది.. ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్ తేజ్ కి అనుకున్నదానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ని ముట్టజెప్పి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది..
వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సాధారణంగా తమ బ్యానర్ లో తెరకెక్కే సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకుంటే యూనిట్ కి గిఫ్ట్ లు ఇవ్వడం మైత్రి సంస్థకి అలవాటు. గతంలో కొరటాల శివ లాంటి దర్శకులకు విలువైల బహుమతులు అందించింది. ఇప్పుడు ‘ఉప్పెన’ టీమ్ కి కూడా కానుకలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు సానాకి ఖరీదైన ఇల్లు కావాలా..? లేక కారు కావాలా..? అని ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హీరో, హీరోయిన్ల వంతొచ్చింది.హీరో వైష్ణవ్ తేజ్ కి రెమ్యునరేషన్ కాకుండా రూ.కోటి రూపాయలు అదనంగా ఇవ్వనున్నారట. అలానే హీరోయిన్ కృతిశెట్టికి పాతిక లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: