బంపర్ ఆఫర్ పట్టేసిన నిధి అగర్వాల్

Chaganti
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నిధి అగర్వాల్ బెంగళూరు వెళ్లి సెటిల్ అయింది. అయితే బాలీవుడ్ నుండి సినీ హీరోయిన్ గా మారిన ఈ భామ తెలుగు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ అనే ఒక్క హిట్ సినిమా తప్ప మరో హిట్ సినిమా చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. చేయడానికి నాలుగైదు సినిమాలు చేసినా ఇస్మార్ట్ శంకర్ అనే ఒక్క హిట్ మాత్రమే దక్కింది. అయితే ఈ భామ బంపర్ ఆఫర్ అందుకుంది అనే ప్రచారం తెలుగు సినిమా వర్గాల్లో వినిపిస్తోంది. అదేమంటే ఆమె పవన్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

 పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక పీరియాడిక్ ఫిల్మ్ కూడా కొన్నాళ్ళపాటు షూట్ చేశారు. ఇప్పుడు దానికి బ్రేక్ ఇచ్చి ఆయన మలయాళం రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే క్రిష్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే గతంలో ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు జోరుగా షికార్లు చేశాయి. 

అయితే దానిమీద ఖచ్చితమైన వార్త బయటకు రాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిధి అగర్వాల్ మీద కొన్ని సీన్స్ అలాగే ఒక సాంగ్ షూట్ చేశారట. ఆ విజువల్స్ చూశాక క్రిష్ కి పూర్తి నమ్మకం కలగడంతో ఆమెను ఈ సినిమాలో ఫైనల్ చేశారు అనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే పాత్రలో నటించే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వలెన్ ఫెర్నాండెజ్ కూడా రాణి పాత్రలో నటిస్తోంది అని అంటున్నారు. దీని మీద కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: