బాలీవుడ్లో చాలా రోజుల నుంచి చర్చల్లో ఉన్న పెళ్లిళ్లలో మూడు జంటలవి ఉన్నాయి. ముదురు ముద్దుగుమ్మ మలైకా అరోరా, అర్జున్ కపూర్ల పెళ్లి ఒకటి అయితే రెండోది రణబీర్ కపూర్-ఆలియా భట్లదే. రణబీర్ - ఆలియా భట్ల పెళ్లి ఈ యేడాది కరోనా లాక్డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికే అయిపోయేది. ఈ యేడాది తాను ఆలియా ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటామని రణబీర్ ఇప్పటికే సంచలన ప్రకటన చేసేశారు. దీంతో వీరిద్దరి పెళ్లిపై అటు బాలీవుడ్ మీడియాతో పాటు ఇటు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియాలు రకరకాలుగా వార్తలు పుట్టించేసుకుంటున్నాయి. ఇక అటు అర్జున్ కపూర్ - మలైకా కూడా ఈ సమ్మర్లోనే పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారంటూ వార్తలు అచ్చేసుకుంటున్నారు.
ఇక ఇప్పటికే ఈ రెండు జంటల పెళ్లిల్లపై రకరకాల వార్తలు ఉండగానే.. ఇప్పుడు మరో పెళ్లిపై హాట్ హాట్ న్యూస్లు బయటకు వస్తున్నాయి. అయితే ఈ క్రేజీ పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. స్టార్ హీరో వరుణ్ ధావన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న నటాషా దలాల్నే ఈ నెల 24 పెళ్లాడబోతున్నాడు. ఇరు వైపులా పెద్దలు వీరి పెళ్లికి ఓకే చెప్పడంతో ముంబైలోని ఆలీబాగ్లో ఓ ఫేమస్ రెస్టారెంట్ను వీరి పెళ్లి కోసం ఇప్పటికే బుక్ చేశారని అంటున్నారు.
అయితే కరోనా ఇంకా విజృంభిస్తుండడంతో పాటు కొత్త కరోనా మరింత ప్రమాదకరంగా ఉండడంతో చాలా పరిమితులు అయిన అతిథులు సమక్షంలోనే ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఇక వరుణ్ 2012లో వచ్చిన కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ తో బాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఇటీవలే 90లో విక్టరీ వెంకటేష్ - టబు జంటగా వచ్చిన కూలీ నెంబర్ వన్ సినిమాను మళ్లీ తెరకెక్కించగా ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.