పూజ హెగ్డే ఇక టాలీవుడ్ లో చేయలేదా..?
సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురం లో సినిమాలతో ఆమె అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యామ్ , అఖిల్ తో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్, ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తుంది. అయితే ఏ భాషలోనూ ఆమెకు టాలీవుడ్ లో దక్కిన గుర్తింపు రాలేదు. ఆమెకు ఇచ్చిన ఈ స్థానం ఏ ప్రేక్షకులు ఇవ్వలేదని చెప్పాలి.. అయితే తాజాగా ఆమె వరుస చూస్తుంటే మళ్ళీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా కనిపిస్తుంది..
తెలుగులో కొన్ని సినిమా చేస్తున్న ఆమె ఆ సినిమా లు పూర్తయ్యాక తెలుగులో ఏ సినిమా ఒప్పుకోవట్లేదు.. అందుకు కారణం ఆమె బాలీవుడ్ లో సినిమా లు చేయడమే.. ప్రస్తుతం ఆమె సల్మాన్ఖాన్తో ఒకటి, రణ్వీర్ సింగ్తో ఒకటి చొప్పున సినిమా చేస్తూ బాలీవుడ్లో యమ బిజీగా వుంది. బాలీవుడ్ తో పోల్చుకుంటే టాలీవుడ్ సినిమాలు వదులుకోవడానికి మొగ్గు చూపుతుంది.. ఒక వేల సల్మాన్, రణ్వీర్ సినిమాలు హిట్ అయితే పూజ కోసం మరింత మంది బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడతారు.అప్పుడు తెలుగు చిత్ర నిర్మాతలు తనకు అయిదు కోట్లు ఇచ్చినా కానీ పూజ హెగ్డే ఆ ఆఫర్ని కాదనవచ్చు. సో ఇప్పట్లో పూజ మనకు దొరకదేమో..