రాధేశ్యాం సినిమా నుంచి అథర్వ ఆ కారణంగానే తప్పుకున్నాడట ....
ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ … విక్రమాదిత్య అనే పాత్రలో నటిస్తుండగా , పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు నిర్మాతలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు.ఇక తాజాగా ఈ సినిమా చిత్రబృందం వారి నుంచి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికి వచ్చింది.
వివరాల్లోకెళితే....రాధే శ్యాం లో కథ ప్రకారం హీరోకి తమ్ముడి పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం కాస్త ఇమేజ్ ఉన్న నటుడు అయితేనే కరెక్ట్ అని చిత్ర బృందం భావించిందట. దాంతో ఈ పాత్రకు గద్దల కొండ గణేష్ ఫేం అధర్వ మురళిని అనుకున్నారట.కానీ అతను ఈ రోల్ చెయ్యడానికి ఇంట్రెస్ట చూపించ లేదని తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.నిజానికి అధర్వ మురళి అతను రెండు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట.
అందుకే అతని పాత్రలో తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ను ఎంపిక చేసుకున్నారట. మొన్నటివరకు రాదే శ్యామ్ షూటింగ్ ఇటలీలో జరిగింది. ఇక మిగిలిన షూటింగ్ పార్ట్ ను వచ్చే వారం నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపనున్నారని సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...