బాలయ్య సినిమా పై ఎందుకింత కన్ఫ్యూజన్..?
ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ బోయపాటి తనకు అచ్చి వచ్చిన బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడు..వీరి కాంబో లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమా లు సూపర్ హిట్ కాగా ఈ సినిమా పై కూడ మంచి అంచనాలున్నాయి.. చిత్రం నుంచి టీజర్ రాగ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకూ ఇది ఎంత పెద్ద తలనెప్పిగా మారిందో చూస్తూనే ఉన్నాం. ఒకరు ఫైనల్ కావడం ఆ వెంటనే మార్పు జరగడం, మళ్ళీ సెట్ చేయడంలో దర్శక నిర్మాతలు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. అరవై పడి దాటిన స్టార్ల సరసన నటించేందుకు చేంజ్ చేయడం దీనికి సంబంధించిన వార్తలతోనే అభిమానులు విపరీతమైన కన్ఫ్యూజన్ కు గురయ్యారు. కొద్దిరోజుల క్రితమే తీసుకున్న సాయేషా సైగల్ కూడా తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన స్థానంలో ప్రగ్య జైస్వాల్ వచ్చేసి నుంచే షూటింగ్ లో కూడా పాల్గొంది. డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ కనిపించబోయే ఈ సినిమాలో అన్నింటి కంటే అఘోరా గెటప్ మీదే ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటిదాకా కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయకపోవడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్ లో ఉంది. హీరోయిన్ ప్రగ్యానే అయినప్పటికి మరో రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సీనియర్ నటీమణులతో చేయిస్తారట.