పవన్ మూవీకి పారితోషికం పెంచిన దేవి శ్రీ ప్రసాద్...?

VAMSI
దేవి శ్రీ ప్రసాద్ ఒక సంగీత సంచలనం. తనదైన మార్కుతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. చిన్న పిల్లలనుండి పెద్ద వయసు వారి వరకు తన బాణీలనే హమ్ చేస్తూ ఉంటారు అంతలా మైమరపిస్తాడు దేవి. అటు మెలోడీ సాంగ్స్ తోనూ ఇటు ఫాస్ట్ బీట్ సాంగ్స్ తోనూ మెప్పిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా కరోనా కారణంగా అందరికీ కొంచెం వర్క్ తగ్గిందని చెప్పాలి. కానీ...దేవి శ్రీప్రసాద్ మాత్రం కొత్తగా తను చేయబోయే పవన్ కళ్యాణ్ మూవీకి సంగీతం చేసే పనిలో పడ్డాడట. అది కూడా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కాబట్టి ప్రేక్షకులకు అంచనాలు భారీగానే ఉంటాయి. దీనికి దేవి శ్రీ ప్రసాద్ అధిక పారితోషికాన్ని అడుగుతున్నట్లు సమాచారం.
తాజాగా మ్యూజిక్ అందించిన సరిలేరు నీ కెవ్వరూ మరియు రంగస్థలం సినిమాలకు కోటిన్నర పారితోషికాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దాని తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో చేస్తున్న పుష్ప మూవీకి కూడా అంతే పారితోషికాన్ని అందుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ కి దాదాపుగా రెండు కోట్లు పారితోషికాన్ని అందుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్త హల్ చల్ చేస్తోంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ కి ఇంత పారితోషికం ఇస్తారా...అన్న వారు లేకపోలేదు.
 అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోనే అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకునే వారిలో దేవి శ్రీ ప్రసాద్ కు పేరుంది.  అయితే ప్రేక్షకులు మాత్రం ఈ మధ్య దేవి అందించిన సంగీతం పట్ల అంతగా సంతోషంగా లేరని తెలుస్తూనే ఉంది. అయినా కూడా చిత్ర యూనిట్ రెండు కోట్లు ఇస్తున్నారంటే వారిని అభినందించాల్సిందే. లేదా ఇందులో పవన్ కళ్యాణ్ చొరవ ఏమైనా ఉందా...మొత్తానికి మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ పాటలను అందిస్తాడో లేదో చూడాలి. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: