మహేష్ తో పూరి మూవీ ఉంటుందట ... కానీ ...??

GVK Writings
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అమీషా పటేల్, రేణుదేశాయ్ హీరోయిన్లుగా తెరకెక్కిన బద్రి సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు రమణ గోగుల అందించిన సాంగ్స్ కూడా మంచి ఆదరణ చూరగొన్నాయి.
ఆ తర్వాత ఒక్కొక్కటిగా అవకాశాలతో కొనసాగిన పూరి జగన్నాథ్ ఆ పై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి తీశారు. ఇక ఆ సినిమా విజయం తరువాత హీరోగా మహేష్ బాబు అలానే దర్శకుడు పూరీ జగన్నాథ్ ల కెరీర్ ఉన్నత స్థాయికి చేరింది. దానితో మరింతగా దూసుకెళ్లిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత కొన్ని విజయాలను అందుకొని ఆపై వరుస పరాజయాలను చవి చూశారు. ఇక ఇటీవల రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి బ్రేక్ అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ కు టాలీవుడ్ లో ఎప్పటినుండో మంచి క్రేజ్ ఉంది. పోకిరి అనంతరం మహేష్ తో పూరీ తీసిన బిజినెస్ మ్యాన్ కూడా పెద్ద విజయాన్ని అందుకుంది.
ఇక ఇటీవల కొద్ది రోజుల నుండి కొన్ని మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలు వర్గాల బట్టి, అలానే పలు ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా చేయనున్నారని ఇప్పటికే మహేష్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేసుకున్న పూరి, ప్రస్తుతం ఆయన కమిట్మెంట్స్ పూర్తి అయిన అనంతరం దానిని పట్టాలెక్కించనున్నారని అంటున్నారు. అయితే పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన లో మహేష్ బాబు మాత్రం నటించడం లేదని ఆ సినిమాలో వేరొక హీరోని ఇప్పటికే పూరి జగన్నాథ్ ఎంపిక చేశారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీటికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: