సోనూసూద్ ని పొగుడుతూ... టాలీవుడ్ హీరోలను తిడుతున్న నెటిజనులు..?
ముఖ్యంగా దక్షిణ భారత దేశ ప్రజలు అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే సోనూసూద్ ని ప్రశంసించడం బాగానే ఉంది కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఇతర నటీనటులను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కొంతమంది తెలుగు నెటిజనులు కూడా టాలీవుడ్ హీరోల ను బాగా తిడుతున్నారు. టాలీవుడ్ హీరోలు కూడా బాగానే దానధర్మాలు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారని మరికొంత మంది నెటిజన్లు తెలుగు హీరోలు చేసిన మంచి పనులను గుర్తు చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను టార్గెట్ చేస్తున్నారు. మొక్కలు నాటడం, చాలెంజ్లు విసరడం తప్ప వీళ్లు ప్రజలకు ఏమి చేయలేరని కొంతమంది నెటిజనులు తిట్టిపోస్తున్నారు.
చిరంజీవి 1998 అక్టోబర్ 2వ తేదీన బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులను స్థాపించి ఇప్పటి వరకు ఎంతో మంది పేద ప్రజలకు కళ్ళను, రక్తాన్ని అందేలా చేశారని... చిరంజీవి కారణంగానే చాలామంది ఇప్పుడు సంతోషంగా తమ జీవితాలు గడుపుతున్నారని... మరికొంత మంది నెటిజన్లు వీరికి ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు. కరోనా కాలంలో కూడా 12 వేల మంది సినీ కార్మికులకు చిరంజీవి నిత్యావసర సరుకులను అందజేశారని గుర్తు చేశారు. కరోనా పోరు పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారని, కోటి రూపాయలు జవానులకు విరాళంగా ఇచ్చారని హుదూద్ బాధితులకు 50 లక్షల రూపాయలను ప్రకటించారని మరి కొంతమంది నెటిజనులు పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తున్నారు.
ఇకపోతే ప్రిన్స్ మహేష్ బాబు 1000 మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారిని బతికించారని కొంతమంది నెటిజన్లు మహేష్ బాబు చేసిన మంచి పనులను గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా దానధర్మాల విషయానికి వస్తే టాలీవుడ్ హీరోలు ఏమీ తక్కువ కాదని స్పష్టమవుతుంది. కానీ కొంతమంది నెటిజన్లు ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా టాలీవుడ్ హీరోలను కావాలనే టార్గెట్ చేస్తూ తిట్టిపోస్తున్నారు.