ఈ డెసిషన్ తీసుకున్న తొలి హీరో !

NAGARJUNA NAKKA

పరిస్థితులకు తగ్గట్టు ఎవరైనా మారాల్సిందే. అయితే కొందరు ముందే మారతారు. మరికొందరు వీళ్లను ఫాలో అవుతారు. షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. దీంతో తమిళ్ స్టార్ సూర్య కొత్త నిర్ణయం తీసుకున్నాడు. సౌత్ ఇండియా స్టార్స్ లో ఈ డెసిషన్ తీసుకున్న తొలి హీరో సూర్యనే. 

 

సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత  అని మాట్లాడుకోవాల్సిందే. థియేటర్స్ తప్ప మరో దాని గురించి ఆలోచించని ప్రేక్షకుడు ప్రస్తుతం ఓటీటీ గురించి ఆలోచిస్తున్నాడు. థియేటర్స్ లో తమను తాము చూసుకునే హీరోలు.. ఫోన్ లో చూసుకోవాల్సిన పరిస్థితి. స్టార్ డైరెక్టర్స్ ఒక్కొక్కరూ వెబ్ సిరీస్ వైపు అడుగేస్తున్నాడు. స్టార్స్ వెబ్ సిరీస్ కు దూరంగా ఉంటున్నా ముందుగా.. ఈ రంగంలోకి సూర్య ఎంట్రీ ఇస్తున్నాడు. 

 

సూర్య నటించే వెబ్ సిరీస్ పేరు నవరస. తొమ్మిది కథలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ తొమ్మిది కథల్లో తొమ్మిది మంది హీరోలు ఉంటారు. ఒక దానిలో సూర్య హీరో అయితే.. మిగిలిన కథల్లో అరవింద స్వామి.. సిద్ధార్థ్ నటించనున్నారు. తొ్మ్మిది మంది డైరెక్టర్స్ తీసే ఈ నవరస వెబ్ సిరీస్ ను మణిరత్నం నిర్మించనున్నాడు. 

 

సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా రిలీజ్ కు రెడీగా ఉండగా.. ఇంతరో కరోనా వచ్చి అడ్డుకుంది. 44ఏళ్ల సూర్య ఇందులో 19 ఏళ్ల యువకుడిగా మారిపోవాలి. అంటే 25ఏళ్లు వెనక్కి వెళ్లిపోవాలి. మేకప్ తో మెయిన్ టైన్ చేయడానికి వీల్లేదు. గ్రాఫిక్స్ తో కవర్ చేసేందుకు వీల్లేదు. 19ఏళ్ల యంగ్ హీరోలా ఎలా మారాడన్న పాయింట్ తో మేకింగ్ రిలీజ్ చేశారు. 

 

వెంకటేశ్ తో గురు సినిమా తీసిన సుధ కొంగర దర్శకత్వంలో ఆకాశమే నీ హద్దురా తెరకెక్కుతోంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. సూర్య సరసన అపర్ణా బాల మురళి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: