స్టార్ హీరోయిన్ని షూటింగ్స్ కు పంపనంటున్న తండ్రి

Murali

దేశంలో లాక్ డౌన్ నిబంధనలకు కొద్దిగా సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సినిమా షూటింగ్స్ కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వం అందరికంటే ముందే అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకు కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందిస్తోంది ఠాక్రే ప్రభుత్వం. అయితే.. ‘ఈ సమయంలో నేను నా కూతుర్ని షూటింగ్స్ కు పంపను’ అంటూ చెప్పుకొచ్చాడు ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి. వృత్తి ముఖ్యమే అయినా నా నిర్ణయాన్ని మార్చుకోనంటున్నాడు.

 

ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో పెద్ద స్టార్. ఈమె తండ్రి ప్రముఖ హిందీ నటుడు శక్తి కపూర్. ఎనభై, తొంభైల్లో హిందీ సినిమాల్లో విలన్ గా తనదైన ముద్ర వేశాడు. లాక్ డౌన్ మినహాయింపులతో త్వరలో షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈయన తన కూతుర్ని షూటింగ్స్ పంపేది లేదని తేల్చి చెప్తున్నాడు. ‘దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. పరిస్థితులు ఏమాత్రం అదుపులో లేవు. రానున్న రోజులు మరింత సంక్లిష్టంగా మారబోతున్నాయి. ఈ సమయంలో సినిమా, సీరియల్స్ షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వటం అంత సబబైన విషయం కాదు. నా కూతురు శ్రద్ధాను తన సినిమాల షూటింగ్ కు పంపను’ అని చెప్పుకొచ్చాడు.

 

బాలీవుడ్ లో శక్తి కపూర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ఆయన ఇంకా వివరణ ఇచ్చారు. ‘వృత్తిగతంగా మన పని ముఖ్యం అని నాకు తెలుసు. కానీ.. ఇటువంటి పరిస్థితుల్లో షూటింగ్స్ పేరుతో ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. దేశంలో ఆస్పత్రి పరిస్థితులు కూడా బాలేదు. సరిపడనన్ని బెడ్స్ కూడా లేవు’ అని చెప్పుకొచ్చాడు. దీనిపై శ్రద్ధా సినిమాల దర్శక నిర్మతలు ఏమంటారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: