కేరాఫ్ కంచరపాలెం తో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈసినిమా తరువాత మహా, డైరెక్ట్ చేసిన రెండో చిత్రం ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య.. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుందని గత కొద్దీ రోజుల నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే ఆ వార్తలే నిజం కానున్నాయి. అవును ఈసినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కానుంది. అయితే ఇందుకోసం అల్లు అరవింద్ కు చెందిన ఓటిటి ఆహా ఈసినిమా రైట్స్ ను తీసుకుందని ప్రచారం జరిగింది కానీ అది నిజం కాదు. లీడింగ్ ఓటిటి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈచిత్రం డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
బాహుబలి నిర్మాతలు ఈ సినిమాను నిర్మించగా సత్యదేవ్ హీరోగా నటించాడు. నిజానికి ఏప్రిల్ 17న ఈసినిమా థియేటర్లలో విడుదలకావాల్సి వుంది కానీ కరోనా వల్ల వాయిదాపడింది. ఇక ఇప్పట్లో థియేటర్లలో తెరుచుకొని పరిస్థితి లేక పోవడంతో నిర్మాతలు డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకోగా క్లీన్ యూ సర్టిఫికేట్ ను పొందింది.
స్టార్ హీరో ఫహద్ ఫసిల్ నటించిన మళయాలం కల్ట్ మూవీ మహేషింటే ప్రతీకారంకు రీమేక్ గా వస్తున్న ఈచిత్రంలో నరేష్ , హరిచందన , సుహాస్ కీలక పాత్రల్లో నటించారు. ఇంతకుముందు ఈసినిమా తమిళం లో కూడా రీమేక్ అయ్యింది. కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించగా లెజండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించాడు.