సమంత మణిరత్నం, శంకర్ దర్శకత్వంలో అవకాశం వచ్చినా ఎందుకు చేయలేదో తెలుసా?
ఇక ఇదిలా ఉంటే... సమంత ఏమాయ చేశావే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వాళ్ళ నాన్నగారికి సీరియస్ అయి హాస్పటల్లో ఎడ్మిట్ అయ్యారు. కానీ సమంత మాత్రం చూడటానికి వెళ్ళలేని పరిస్థితి. తర్వాత చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారికి చాలా సీరియస్గా ఉన్నా షూటింగ్ సమయంలో మాత్రం ఎప్పుడూ కూడా ఆ బాధను తెలియకుండా నటించింది సమంత. ఇక ఏమాయచేశావే సినిమా అవ్వకముందే దిల్రాజు బృందావనంలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. సమంత తన నటనతో ప్రేక్షకులను మాయ చేసిందనే చెప్పాలి. ఒక ఈ చిత్రాన్ని మంజుల నిర్మించారు. ఈ సినిమా సమయంలోనే మహేష్బాబుతో నటించే అవకాశం ఇస్తాను చేస్తావా అని అన్నారట. తప్పకుండా చేస్తానని సమంత అన్నారట. దాంతో మహేష్ ఖలేజా సినిమా అవ్వగానే దూకుడు చిత్రంలో మెయిన్ హీరోయిన్గా పెట్టుకోమని మంజల సిపార్స్ చేయగా సమంతకు ఆ ఛాన్స్ వచ్చింది. ఒక తమిళంలో మణిరత్నం సినిమాలో గౌతమ్ కార్తీక్ డెబ్యూట్ మూవీ సినిమాలోనూ శంకర్ దర్శకత్వంలో ఐ సినిమాలోనూ నటించే అవకాశం దక్కింది. కానీ అదే సమయంలో సమంతకి స్కిన్ ప్రాబ్లమ్ రావడంతో దాదాపురెండు నెలలు రెస్ట్ తీసుకోవలసి వచ్చింది దాంతో ఆ రెండు సినిమాల్లోనూ నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది సమంత. ఆ రెండూ మిస్ అయినందుకు సమంత చాలా బాధపడింది. ఇక అవి మిస్సయ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఈగ చిత్రంలో నటించింది.