హీరోలంతా పార్టనర్స్‌తో రొమాంటిక్‌గా ఉంటే.. సల్మాన్‌ మాత్రం..!

JSR
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ భయంతో అంతా ఇంటికే పరిమితమయ్యారు. సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లలోనే ఉంటు ఇంటి పనుల్లో మునిగిపోయారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ కూడా తన పాన్వెల్ ఫాం హౌస్‌లో సేద తీరుతున్నాడు. మిగతా హీరోలు పార్టనర్స్‌తో ఎంజాయ్ చేస్తుంటే స్టిల్‌ బ్యాచిలర్ అయిన సల్మాన్‌ పెట్స్‌ తో కాలం గడిపేస్తున్నాడు.

తాజాగా తన పెంపుడు గుర్రానికి సల్మాన్.. గడ్డి పెడుతున్న వీడియో విపరీతంగా వైరల్‌ అయ్యింది. గుర్రానికి గడ్డి తినిపిస్తూ సల్ామన్ అదే గడ్డిని తాను కూడా తిన్నాడు. అంతేకాదు తన గుర్రంపై స్వారీ చేస్తూ ఆ వీడియోను కూడా షేర్ చేశాడు సల్మాన్. అందరు హీరోలు తమ పార్టనర్స్‌తో రొమాంటిక్‌గా క్వారెంటైన్‌ను ఎంజాయ్ చేస్తుంటే సల్మాన్‌ మాత్రం పెట్స్‌ తో టైం పాస్ చేస్తున్నాడు.

అదే సమయంలో సినిమా పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు సల్లూ భాయ్. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన రాథే సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలు పెట్టేశాడు సల్మాన్‌. దర్శకుడు అందుబాటులో లేకపోయినా తానే దగ్గరుండి తన ఫాం హౌస్‌లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నాడు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Breakfast with my love...

A post shared by {{RelevantDataTitle}}