హీరో ప్రభాస్ కి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెరికాలోనూ అతడికి వీరాభిమానులున్నారు. అయితే ఇకపోతే మిర్చి ఫేం రిచా గంగోపాధ్యాయ ప్రస్తుతం అమెరికాలోనే ఉంటోంది. ఈ భామ మిర్చి..మిరపకాయ్..భాయ్ లాంటి చిత్రాల్లో నటించింది కానీ ఆశించినంత పేరు మాత్రం రాలేదు.ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడంలో విఫలమైంది. అవకాశాలు ముఖం చాటేయడంతో విసిగిపోయి… చివరికి గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లి మాస్టర్స్ చదివింది. ఆ తరువాత బిజినెస్ స్కూల్ లో స్నేహితుడు అయిన క్లాస్ మేట్ జో లాంగెల్లాను పెళ్లి చేసుకుని ఓ సెటిలైపోయింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటూనే ఈ భామ.
తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ భామ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంది ఈ భామ. అయితే అక్కడ ఫ్యాన్స్ ముందు ఊహించని విధంగా ఇరకాటంలో పడింది. ఓ అభిమాని ప్రభాస్ తో మీరు ఓ సినిమా చేశారు కదా. అతని గురించి చెప్పండి.. అని అడగగా. “ప్రభాస్ నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఎంతో మంచివాడు. చాలా వినయంగా ఉంటాడు. నాకు ఎంతో ఇష్టమైన నటుడు“ అని రిచా అంది. మరో అభిమాను కూడా ప్రభాస్ అన్నయ్య గురించి ఒక్క మాట చెప్పండి.. అని రెట్టించి అడిగాడు. దాంతో విసిగిపోయిన రిచా ఒకే ప్రశ్నని ఎన్నిసార్లు అడుగుతారంటూ మండిపడింది. ఇప్పటికే మీకు చెప్పానుగా అంటూ బుంగ మూతి పెట్టేసింది.
దీంతో మరో అభిమాని మా వాళ్లకి ప్రభాస్ అంటే పిచ్చేలే అక్క. అందుకే అన్ని సార్లు అడుగుతున్నారు. నువ్వు అవేవీ పట్టుంచుకోకు అంటూ కవర్ చేసేశాడు. దానికి స్పందనగా “తెలుసులే తమ్ముళ్లు` అనేసింది రిచా. దీనికి ఓ ఆకతాయి “రిచా అక్క అయితే..ప్రభాస్ బావ అవుతాడు` అనేశాడు. దానికి రిచా కూడా పెద్దగా సీరియస్ అవ్వలేదు. లైట్ తీసుకుని ఇప్పటికి చాటింగ్ చాలు అంటూ గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రిచా వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతోంది. పెళ్లి తర్వాత అమెరికాలోనే స్థిరపడింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికా కరోనాతో చాలా డేంజర్ జోన్లో ఉందని చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: