యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ నిన్న విడుదలై యూనానిమస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో మొదటి రోజు వసూళ్ల విషయంలో అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల షేర్ తో నితిన్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టి భీష్మ రికార్డు సృష్టించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 6.28కోట్ల షేర్ తో అదుర్స్ అనిపించింది.
మార్నింగ్ షోస్ డల్ గానే వున్నా మ్యాట్నీ నుండి థియేటర్లు హౌస్ ఫుల్ కావడం తో మొదటి రోజు ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టింది దాంతో ఎట్టకేలకు మూడు వరుస డిజాస్టర్ల తరువాత భీష్మ తో సూపర్ హిట్ కొట్టబోతున్నాడు నితిన్. 19కోట్ల రాబడితే భీష్మ బ్రేక్ ఈవెన్ కానుండడం తో ఫుల్ రన్ లో ఆ టార్గెట్ ను సులభంగానే చేరుకొని మంచి లాభాలను తీసుకరావడం ఖాయంగా కనిపిస్తుంది. వెంకి కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం లో రష్మిక మందన్న కథానాయికగా నటించగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది.
తెలుగు రాష్ట్రాల్లో భీష్మ మొదటి రోజు వసూళ్ల వివరాలు :
నైజాం - 2.20 కోట్లు
సీడెడ్ - 0.80 కోట్లు
ఉత్తరాంద్ర - 0.62 కోట్లు
గుంటూరు -0.77 కోట్లు
తూర్పు గోదావరి - 0.66 కోట్లు
పశ్చిమ గోదావరి - 0.56 కోట్లు '
కృష్ణా - 0.40 కోట్లు
నెల్లూరు - 0.27 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్ = 6.28 కోట్లు