ఆత్మహత్య చేసుకున్న యువ గాయని.. వేదింపులే కారణం!

JSR
ఇటీవల గ్లామర్‌ ప్రపంచంలో లోటు పాట్లు తరుచూ బయటపడుతున్నాయి. సినిమాల్లో టీవీల్లో పనిచేసే నటీనటులు సాంకేతిక నిపుణులు మరణ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న సెలబ్రిటీలు ఎక్కువవుతున్నారు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సెలబిట్రీ చిన్న చిన్న కారణాలతో ఆత్యహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కన్నడ గాయని బలవన్మరణానికి పాల్పడింది.

కన్నడ సినిమాలో గాయని గా ఎదుగుతున్న 27 ఏళ్ల సుష్మిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు నగరం లోని తన తల్లి ఇంట్లో ఈ దారుణానికి పాల్పడింది సుష్మిత. తనతో పాటు తన తల్లి పై కూడా వరకట్న వేదింపులు ఎక్కువ కావటంతో ఆదివారం రాత్రి తను జీవితాన్ని అర్థాంతరంగా ముగించాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే... గాయనిగా మంచి పేరు సంపాందించుకున్న సుష్మితకు ఏడాడిన్నర క్రితం శరత్‌ కుమార్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే వారిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ముఖ్యంగా కట్నం విషయంలో వేదింపులు ఎక్కువ కావటంతో ఆమె కొంత కాలంగా తల్లి దగ్గరే ఉంటుంది. కొద్ది రోజులుగా సుష్మితతో పాటు ఆమె తల్లిని కూడా అత్తింటివారు కట్నం కోసం వేదించటం ప్రారంభించారు. వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడింది సుష్మిత.

కన్నడ సూపర్‌ హిట్ అయిన శ్రీ సామాన్య, హలు తుప్పా లాంటి సినిమాల్లో పాటలు పాడింది సుష్మిత. అంతే కాదు ఇటీవల ఆమెకు బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. గాయని ఎంతో సాధించాలని కలలు గన్న ఓ యువ గాయని తన కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: