`దేశముదురు` అల్లు అర్జున్ది కాదు.. అసలు హీరో ఎవరో తెలుసా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంతో 2007, జనవరి 12న విడుదలైన చిత్రం దేశముదురు. ఈ చిత్రంలో హన్సికా మోత్వాని తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయింది. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రభాస్ యోగి చిత్రంతో పోటీ పడి మరీ సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా పక్కా మాస్గా ఉండటంతో ప్రేక్షకులు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. దానికి తోడు పూరీ డైలాగులు.. హన్సిక అందాలు.. అల్లు అర్జున్ డైనమిక్ యాక్షన్.. అలీ కామెడీ ట్రాక్ అన్నీ కలిపి అదరగొట్టింది దేశముదురు.
అయితే వాస్తవానికి ఈ చిత్రం హీరో అల్లు అర్జున్ కోసం రాసింది కాదట. ముందు పూరీ జగన్నాథ్ ఈ కథను మరో హీరోకు చెప్పాడట. ఆయనే హీరో అనుకున్నాడు కూడా.. కానీ అనుకోకుండా బన్నీ వచ్చేసాడు. ముందు ఈ కథను ఏ హీరోకు చెప్పాడో తెలుసా.. సుమంత్. అవును.. అక్కినేని మేనల్లుడికే ఈ కథను పూరీ ముందు చెప్పాడు. అప్పటికి సత్యం, గౌరి, మధుమాసం, గోదావరి లాంటి సినిమాలతో సుమంత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో పూరీ దేశముదురు కథను ఆయనకు చెప్పాడు.
అయితే హీరో సన్యాసిని ప్రేమించడం ఏంటి.. అసలు అలా జరుగుతుందా ఎక్కడైనా అంటూ సుమంత్ ఈ కథను రిజెక్ట్ చేసాడు. కానీ అప్పుడు పూరి సుమంత్ కి కేవలం లైన్ మాత్రమే చెప్పాడట .. ఒకవేళ ఫుల్ నెరేషన్ ఇచ్చుంటే బన్నీ కాకుండా తానే ఈ సినిమా చేసుండేవాడినేమో అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సుమంత్ చెప్పాడు. ఇలా సుముంత్ ఎన్నో మంచి వదులుకున్నాడు. ఇక ఏదేమైనా అల్లు అర్జున్ కెరీర్లో అదే పెద్ద హిట్ అని చెప్పాలి. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం `అలవైకుంఠపురంలో`. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవతి 12 ఈ చిత్రాన్ని విడుదల కానుంది.