పవన్ కళ్యాణ్, పింక్ రీమేక్ లాంచ్

 
 
గత ఏడాది అజ్ఞాతవాసి చిత్రం  తో ప్రేక్షకులముందుకు  వచ్చిన  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఆ  తరువాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి  వెళ్ళి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు   పవన్ కళ్యాణ్  మళ్ళీ సినిమాల్లోకి  రీఎంట్రీ  ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.  కేవలం  20రోజుల్లో  షూటింగ్  పూర్తి చేసేలా  వుండే కథను  ను ఎంచుకున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏంటంటే హిందీ లో విజయం సాధించిన పింక్.   దిల్ రాజు తో  కలిసి  బోనీ  కపూర్ ఈ  పింక్  ను  పవన్ కళ్యాణ్ తో తెలుగులో రీమేక్ చేయనున్నాడు.  ఈ చిత్రానికి ఎంసీఏ  ఫేమ్  వేణు శ్రీరామ్  దర్శకత్వం వహించనున్నాడు.  ఈరోజు ఈ చిత్రం దిల్ రాజు ఆఫీస్ లో పూజా కార్యక్రమాలతో  లాంచ్ అయ్యింది.  ఈచిత్రంలో యంగ్ హీరోయిన్ నివేత థామస్ కీలక  పాత్రలో నటించనుంది. వచ్చే ఏడాది  ఫిబ్రవరి లో పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 
 
ఇక ఒరిజినల్ వెర్షన్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో  నటించగా  2016 లో  విడుదలైన ఈ చిత్రం  100కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.  సోషల్ మెసేజ్ తో  తెరకెక్కిన ఈ చిత్రం  విమర్శకులు  ప్రశంసలు కూడా  పొందింది. ఈ చిత్రం  ఇటీవల కోలీవుడ్ లో 'నెర్కొండ పరవాయ్' అనే టైటిల్ తో రీమేక్ చేశారు.  తల అజిత్ నటించిన ఈచిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి కోలీవుడ్ లో ఈ ఏడాది  బిగ్గెస్ట్  బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈచిత్రాన్ని కూడా  బోనీ కపూర్  నిర్మించగా  ఖాకి ఫేమ్  వినోత్ తెరకెక్కించాడు.  మరి   ఇప్పుడు తెలుగు లో రీమేక్ లో అవుతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: