ఆ సమయంలో నన్ను నవ్వించడానికి చూసినా బాధపడేదాన్ని
ఈ ముగ్గురు కలిసి ఓ యాక్షన్ కామెడీ చిత్రం చేస్తే ఎలా ఉంటుంది?….ఊహిస్తే ‘అద్బుతం’ అనిపించడం ఖాయం.దీపికా పదుకొనె ‘పద్మావతి’, ‘బాజీరావు మస్తానీ’, ‘త్రిబులెక్స్’, ‘పీకూ’ చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. కత్రినా కైఫ్ ‘టైగర్ జిందా హై’, ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘ఏక్ ద టైగర్’ చిత్రాల్లో అద్భుతమైన పోరాటాల్లో నటించి ఆకట్టుకుంది. రాణి ముఖర్జీ ‘మర్దాని’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ వంటి చిత్రాల్లో చేసి శభాష్ అనిపించుకుంది. అన్నీ కుదిరితే ఈ ముగ్గురు కలిసి ఓ యాక్షన్ కామెడీ సినిమాతో వెండితెరపై హల్చల్ చేయబోతున్నారు. హాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ కామెడీ ‘చార్లీస్ ఎంజెల్స్’ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కామెరాన్ డియాజ్, డ్రూ బార్రీమోర్, ల్యూసీ లియు ప్రధాన పాత్రధారులుగా మెక్ జీ దర్శకత్వంలో 2000లో వచ్చిన ‘చార్లీ ఏంజెల్స్’ చిత్రం సంచలన విజయం సాధించింది. 2003లో దీనికి సీక్వెల్గా వచ్చిన చిత్రం కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. బాలీవుడ్ ‘చార్లీస్ ఎంజెల్స్’ లో దీపికా, కత్రినాతోపాటు తాను కూడా నటిస్తే బాగుంటుందని రాణిముఖర్జీ ఇటీవల తన మనసులో మాట చెప్పేసింది. దీపికా ప్రస్తుతం ‘ఛపాక్’, ’83’ చిత్రాల్లో, కత్రినా కైఫ్ ‘సూర్యవంశీ’, రాణి ముఖర్జీ ‘మర్దాని 2’లో చేసారు.
దీపికా పదుకొనె హాలీవుడ్లో ‘త్రిబులెక్స్:రిటర్న్ ఆఫ్ గ్జెండర్ కేజ్’ చిత్రంలో చేసింది. తాజాగా మరోసారి హాలీవుడ్ ఆడియెన్స్ని అలరించడానికి సిద్ధమవుతుంది. ‘త్రిబులెక్స్’ సిరీస్లో భాగంగా రాబోయే నాలుగో చిత్రంలో మెయిన్ లీడ్గా దీపికా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డీజే కరుసో స్పష్టం చేసారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి కరుసో స్పందిస్తూ.. ‘దీపికాతో పనిచేయాలని మేం కూడా అనుకుంటున్నాం. కొత్త ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పూర్తయ్యింది. త్వరలో దీపికాని కలుస్తాం’ అని ట్వీట్ చేశారు.