అత్యాచారాలపైన ర‌కుల్ షాకింగ్ కామెంట్స్...!?

Satya

రకుల్ ప్రీతి సింగ్ టాలీవుడ్ లో పొడుగు కాళ్ళ సుందరి. ఆమె  స్థాయి  అలా ఒక్క సారి టాప్ రేంజిలోకి వెళ్ళింది. మళ్ళీ అలాగే దిగిపోయింది. ఒక దశలో రకుల్ లేని సినిమాలు లేవు. ఆమె పేరు తలవని యువ హ్రుదయం లేదు. ఆమెతో జతగా నటించాలని ఆరాటపడని హీరోలు లేరంటే కూడా అతిశయోక్తి కాదు. అంతలా వెండితెరను పరచుకున్న అందం రకుల్ ది. ఆమె కోసం కొన్ని సినిమాలు కూడా ఆడాయి. బాలయ్య పక్కన కధానాయకుడులో ఒక సాంగ్ లో శ్రీదేవిగా మెరిసిన రకుల్ నాగార్జున తో మన్మధుడు 2 లో నటించింది. మళ్ళీ ఇపుడు ఆయన‌తో సిల్వర్ స్క్రీన్ ని  షేర్ చేసుకుంటోంది.

 

ఇదిలా ఉండగా రకుల్  తాజాగా బ్యూటిఫుల్ సిటీ  విశాఖలో హల్చల్ చేస్తోంది. ఆమె కొన్ని ఒపెనింగ్స్ తో పాటు ఒక వాక్ లో కూడా పాలుపంచుకుంది. ఆమెను చూసేందుకు విశాఖ జనమంతా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా లైంగిక వేధింపులు పెద్ద ఎత్తున జరుగుతుననాయి.

 

అపుడే పుట్టిన పిల్లల నుంచి ముసలి వారు వరకూ మహిళలు ఎంతో మంది లైంగిక వేధింపులకు బలి అవుతున్నారు. దీని మీద రకుల్ తనదైన అభిప్రాయాలను విశాఖ వేదికగా  పంచుకుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే స్పర్శలో తేడాలను తల్లిదండ్రులే వివరించాలని రకుల్ కోరింది.  అపుడే బాలికలు, యువతులపైన జరుగుతున్న లైంగిక దాడులు కొన్ని అయినా ఆగుతాయని  ఆమె అంటోంది.

 

ఇక ప్రేమతో తాకే స్పర్శకు, దురుద్దేశ్యంతో తాకే స్పర్శకు మధ్య తేడాను కనుక పిల్లలు చిన్నతనం నుంచే గుర్తించిన  పక్షంలో వారు చాలా వరకూ జాగ్రత్తగా ఉంటారని ఆమె విలువైన సూచనలే చేసింది. మరి రకుల్ చెప్పినట్లుగా పేరెంట్స్ చిన్నతనం నుంచే వాటిని ఆచరణలో పెడితే కామాంధులతో పాటు , వారి చెడ్డ చూపులు, ప్రవర్త్న నుంచి సులువుగా బయటపడవచ్చు. మరి రకుల్ చెప్పింది. అందరూ అర్ధం చేసుకుంటే బాగుంటుందేమో  కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: