రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ రేంజ్ కు ఎదుగుతున్న హీరోయిన్. ఈ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో రెండు పెద్ద సినిమాలు చేస్తున్నది. అందులో ఒకటి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ కాగా, రెండో సినిమా అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 20 వ సినిమా. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్లో పెద్ద సినిమాలే అని చెప్పాలి.
ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ, నాని వంటి సెకండ్ స్టార్స్ తో సినిమా చేసింది. పెద్ద స్టార్స్ తో సినిమా చేయలేదు. ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సినిమానే పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ అవుతున్నది. దీని తరువాత నితిన్ తో చేస్తున్న భీష్మ ఉంటుంది. వీటి తరువాత సుకుమార్ సినిమా ఉంటుంది. సుకుమార్ సినిమా పూర్తి కావాలి అంటే చాలా సమయం పడుతుంది.
రాజమౌళి లాగానే సుకుమార్ కూడా పర్ఫెక్షన్ పై ఎక్కువ దృష్టిపెడతాడు. అందుకే సినిమా అంటే పర్ఫెక్ట్ గా రావాలి అని ట్రై చేస్తుంటాడు. రష్మిక ఈ మూడు సినిమాలు తప్ప మరో సినిమాకు సైన్ చేయలేదు. ఎందుకు ఏమిటి అన్నది తెలియాల్సి ఉన్నది. మొదట్లో రష్మీక ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు లేకపోడం విశేషం. ఎందుకో ఆ దూకుడును ఆమె ప్రదర్శించలేకపోతున్నది.
కారణాలు ఏంటి అన్నది తెలియడం లేదు. పైగా ఇటీవలే ఈ అమ్మడు కొన్ని ట్రోల్స్ ను కూడా ఎదుర్కొన్నది. ఆమె ఫోటోను పెట్టి నానారకాలుగా రాశారని మండిపడింది. నిజమే కదా ఎవరైనా పర్సనల్ లైఫ్ లో వేడిపెడితే ఊరుకుంటారా చెప్పండి. ఎంతటి సినిమా వాళ్లైనా సరే ఎందుకు ఊరుకుంటారు. ఏదోకటి అనేస్తారు కదా. అందుకే పాపం ఈ హీరోయిన్ కూడా పెద్దగా ఈ విషయంలో కొంత వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తోంది.