ప్రస్తుతం నితిన్, రష్మికా జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ దీపావళి కానుకగా విడుదల చేశారు. ఆ పోస్టర్ కుర్రకారును పిచ్చెక్కించిన విషయం తెలిసిందే. కాగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది పిబ్రవరి 21 న విడుదల కానుంది.
తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్డే సందర్బంగా ‘భీష్మ’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ పేరిట టీజర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్లో టాప్ ప్లేస్లో ఉండటంతో పాటు, ఇప్పటికే నాలుగు మిలియన్ వ్యూస్ను రాబట్టడం విశేషం. ఇప్పుడు ఎక్కడా విన్నా.. ఎక్కడ చూసినా.. యంగ్ హీరో నితిన్ ‘భీష్మ’ సినిమా టీజర్ గురించే చర్చ జరుగుతోంది. నితిన్ యాటిట్యూడ్కు తోడు రష్మికా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఒక రేంజ్ కు తీసుకెళ్తుంది.
ఇది ముఖ్యంగా లవర్స్కు తెగ కనెక్ట్ చేసేలా ఉంది. టీజర్ కు వస్తున్న ఆధరణతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా హీరో నితిన్ ట్విటర్ వేదికగా కృతఙ్ఞతలు తెలిపాడు. కాగా, చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ‘మా గురుజీ త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీష్మ’మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. దీనికి ప్రేక్షకుల నుంచి అనూహ్య రీతిలో భారీ స్పందన లభించిందన్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయని.. నితిన్, రష్మికా జంట చూడముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయన్నారు. అంతకుముందు దీపావళి కానుకగా విడుదలైన చిత్ర పోస్టర్స్కు కూడా విశేష స్పందన వచ్చిందని తెలిపారు. భీష్మ చిత్ర కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయని ప్రతీ యువకుడు నితిన్ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశామని పేర్కొన్నారు. అలాగే రష్మిక క్యారెక్టర్కు ప్రతీ యువతి కనెక్ట్ అవ్వడం ఖాంయం. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్గా సాగడంతో పాటు వినోదాత్మకంగా ఉంటుంది’అని దర్శకుడు తెలిపాడు.