మెగాపవర్స్టార్ రామ్చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రంలో చెర్రీ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇంతకుముందు చూడని రామ్ చరణ్ రంగస్థలంలో కనిపించాడు. రామ్ చరణ్ ఇలా కూడా చేయగలడా అని అందరూ ఆశ్చర్యపోయారు. కలెక్షన్ల పరంగా దూసుకుపోవడమే కాకుండా, చాలా అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా.
మొన్న జరిగిన సైమా అవార్డుల్లో రంగస్థలం అవార్డుల మోత మోగించింది. తాజాగా మరో అవార్డు కూడా చెర్రీకి లభించింది. చిట్టిబాబు పాత్రకు గాను మరో అవార్టును బుట్టలో వేసుకోబోతున్నాడు. సంతోషం అవార్డ్స్ 2019 కు చిట్టిబాబుకు ఆహ్వానం అందింది. ఈ అవార్డుల వేడుక హైదాబాద్లోని నోవాటెల్లో ఈ నెల 29 జరుగునుంది.
ప్రస్తుతం ‘సైరా’ చిత్రంతో చాలా బిజీగా ఉన్న చెర్రీకి సంతోషం టీం నుండి ఆహ్వానం లభించింది. ‘సైరా’ చిత్రం అక్టోబరు 2 వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా చరణ్ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లో చరణ్ అవార్డు కోసం వెళతారా? లేదా అనేది క్లారిటీ లేదు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర విడుదలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు మెట్రో నగరాలన్నిటిలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.
హీరోగా మంచి ఫామ్లో ఉన్నా కూడా నిర్మాతగా సక్సెస్ అవుడానికి తగిన కృషి చేస్తున్నాడు. హీరోగా అటు అవార్డుల పర్వం, నిర్మాతగా ఇటు కాసుల వర్షం కురిపించడానికి సిద్ధమవుతున్నాడు. చిట్టిబాబుకు మరో అవార్డు దక్కినందుకు ‘రంగస్థలం’ చిత్ర యూనిట్ అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇంకెన్ని అవార్డులు గెలుచుకుంటుందో వేచి చూడాలి.