ఎవరు’ చిత్రంతో చాలా ఏళ్ల తరువాత సక్సెస్ బాట పట్టింది రెజీనా. ఈ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం `ఎవరు`. ఇటీవలె విడుదలై ఘన విజయం సాధించింది. పీవీపీ సినిమా నిర్మించిన చిత్రమిది. వెంకట్ రామ్జీ దర్శకుడు. పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. సినిమా విడుదలైనప్పటి నుంచీ మంచి స్పందన వస్తోంది. రెజీనా. ఆ మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన ఐఫా వేడుకల్లో బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ డ్రెస్లో వీక్షకుల చూపు తిప్పుకోకుండా చేసింది. అప్పటి నుండి ఏదో ఒక సందర్భంలో తనలోని గ్లామర్ యాంగిల్ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది కాని.. సరైన ప్లాట్ ఫామ్ దొరకనేలేదు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
రెజీనా మాట్లాడుతూ... ట్రైలర్ చూపిన్పుడే అయదరూ ఇంట్రస్టింగ్ లుక్ అని అన్నారు. ఈ సినిమా ఇంత మంచి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ టీం అంతా నాకు చాలా హిల్ప్ చేశారు. అబ్బూరి రవిగారు నాకు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్యూ సోమచ్ సార్. ఈ చిత్రంలో ఒక సీన్ కోసం 12 గంటల పాటు నీళ్ళలోనే ఉండాల్సి వచ్చింది. అప్పడు ప్రొడక్షన్ టీం నన్ను చాలా బాగా చూసుకుంది ఎక్కడా ఏ ఇబ్బంది రాకుండా. ఇన్హేలర్, స్టీమ్ ట్యూబ్స్ అన్నీ పంపించేవారు. ప్రొడ్యూసర్గారు అందర్నీ మ్యానేజ్ చేసుకుంటూ చాలా బాగా చూసేవారు. ఇక రామ్గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద చెట్టులాంటివారు అంటే ఒక కొబ్బరొచెట్టు అయితే మేమంతా చిన్న చిన్న మొక్కలం అన్న మాట. ఇక శేష్ ఆయన ఎంతో అద్భుతమైన నటుడు. నాకు సెట్స్లో చాలా బాగా హెల్ప్ చేసేవారు అని అన్నారు.