ఈ వారం బిగ్బాస్ ఎలిమినేషన్కు మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. బిగ్బాస్ ఈ వారం నామినేషన్కు మొత్తం ఆరుగురిని ఎంపిక చేశాడు. వీరిలో ఎవరు తమకు బదులుగా వేరే వాళ్లను రీప్లేస్ చేయాలో చెప్పే ఆప్షన్ కూడా ఇచ్చాడు. మొదట కంటెస్టెంట్గా వచ్చిన రాహుల్ తనకు బదులుగా తీన్మార్ సావిత్రిని రీ ప్లేస్ చేశాడు. అయితే మానిటర్ హేమ మాత్రం మళ్లీ రాహుల్నే నామినేట్ చేసింది.
రెండో బెల్ మోగాక వచ్చిన వరుణ్ సందేశ్ పునర్నవి భూపాలంను నామినేట్ చేశాడు. ఆమె ఏకాంతంగా ఉంటుందన్న కంప్లెంట్ చేశాడు. హేమ వరుణ్ను సేవ్ చేసి పునర్నవిని నామినేట్ చేసింది. మూడో బెల్కు వితికా షెరు వచ్చి.. అషూ రెడ్డిని తనకు బదులు రీప్లేస్ చేయాలనుకుంటున్నాని తెలిపింది. తను అందరితో సరిగా కలవడం లేదని, కొంచెం వేరుగా ఉంటుందని చెప్పింది. హేమ మాత్రం అషూ రెడ్డిని సేవ్ చేసి వితికా షెరునే నామినేట్చేసింది.
నాల్గో బెల్ మోగాక వచ్చిన శ్రీముఖి.. తనకు బదులుగా హిమజను రీప్లేస్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. హిమజ అన్నీ లైట్ తీస్కొంటుందని శ్రీముఖి చెప్పగా హిమజ గట్టి కౌంటర్ ఇచ్చింది. హేమ మాత్రం శ్రీముఖిని సేవ్ చేసి హిమజనే నామినేట్ చేసింది. జాఫర్.. తనకు బదులుగా మహేష్ విట్టాను రీప్లేస్ చేయాలనుకుంటున్నానని చెప్పగా హేమ జాఫర్ను సేవ్ చేసి మహేష్ను ఎలిమినేషన్కు నామినేట్ చేసింది.
మానిటర్(హేమ)- బాబా భాస్కర్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సేవ్చేసి, మరొకరిని నామినేట్ చేయాలని ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఆదేశించాడు. గ్రూపు సభ్యులు అందరూ కలిసి భాస్కర్ను సేవ్ చేసి హేమను నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమ నామినేట్ కాగా.. వీరందరిలో ఎవరోకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు.