అక్కినేని ఫ్యామిలి, అక్కినేని ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది అఖిల్ మీదనే. అఖిల్ మాస్ హీరోగా రాణిస్తాడు ఇప్పుడున్న టాప్ హీరోలతో సమానంగా పోటీ ఇస్తారని అనుకున్నారు. ప్రాక్టీకల్ విషయానికి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయ్యింది.
అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు. మూడు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తున్నాడు. దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అఖిల్ సినిమాకు అన్ని సెట్ అయ్యాయి. ఫస్ట్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు.
హీరోయిన్ మాత్రం ఇంతవరకు సెట్ కాలేదు. ఫస్ట్ అఖిల్ కు జోడిగా పూజా అనుకున్నారు. ఆమె బిజీగా ఉండిపోయింది. తరువాత రష్మిక అనుకుంటే ఆమె కూడా బిజీగా కావడంతో డేట్స్ దొరకలేదు. భరత్ అనే నేను హీరోయిన్ కియారా చేస్తుందని అనుకుంటే అది కుదరలేదు.
ఫైనల్ ఫైనల్ గా ఇప్పుడు తెరమీదకు మరో పేరు వచ్చింది. అదే నివేద పేతురాజ్. నివేద టాలెంటెడ్ హీరోయిన్. చిత్రలహరి సినిమాలో మంచి నటనను కనబరిచింది. నివేదను సెలక్ట్ చేస్తున్నారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ లోనేఉన్నది . ఈనెల 15 వ తేదీ నుంచి షెడ్యూల్ స్టార్ట్ కావాలి. మరి ఈలోపైనా హీరోయిన్ ను సెట్ చేస్తారా చూద్దాం.