160 దేశాల్లో "ధనుష్" సినిమా…
ప్రపంచంలో అత్యంత క్వాలిటీతో, అత్యంత వైవిధ్యభరితమైన్ కథలతో సినిమాలు నిర్మ్ంచేది హాలోవుడ్ లేనే. అందుకే హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలు విడుదలవుతాయి. మరి అతువంటి హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఆ అవకాశం కోసం అందరూ ఎదురు చూస్తారు. ఇండియా నుండి అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్ళు హాలీవుడ్ సినిమాల్లో నటించారు.
అయితే దక్షిణాది నుండి హాలీవుడ్ సినిమాల్లో నటించిన వారు చాలా తక్కువనె చెప్పాలి. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమాలో నటించాడు. అయితే ఇప్పుడు తాజాగా కొలీవుడ్ స్టార్ అయిన ధనుష్ హాలీవుడ్ చిత్రంలో కనిపిస్తున్నాడు. ధనుష్ ఇది వరకు ఒకటి హిందీ చిత్రాల్లో కూడా నటించాడు. ఈయన ఎంచుకునే చాలా వైవిధ్య భరితంగా ఉంటాయి.
ప్రస్తుతం ధనుష్ “ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్” అనే సినిమాతో హాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 21 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో విడుదలవుతుంది. రొమైన్ ప్యూర్తొలా రాసిన “ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్రోబ్” పుస్తకం ఆధారంగా కెనడియన్ స్క్రిప్ట్ రైటర్ కమ్ డైరెక్టయర్ కెన్ స్కాట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హాలీవుడ్ భామలు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో ధనుష్తో జతకట్టారు.
ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించారు. తమిళంలో ఈ చిత్రాన్ని పక్కిరి అనే టైటిల్తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఇటీవలే బార్సిలోనా సెయింట్ – జోర్డి ఫిలిమ్ ఫెస్టివల్లో అత్యుత్తమ కామెడీ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఇండియాలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోల్డెన్ రేషియో ఫిలిమ్స్ సీఈఓ అభియానందసింగ్ తరపున బెంగళూరులో మంగళవారం 160 దేశాలలో సినిమా విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.