అల్లు అరవింద్, అఖిల్ సినిమా కోసం రంగంలోకి దిగిన నాగార్జున..!
దీంతో ప్రస్తుతం అక్కినేని అఖిల్ ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేతిలో పెట్టారు కింగ్ నాగార్జున. అక్కినేని అఖిల్ హీరోగా 'గీతాఆర్ట్స్ 2' బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించబోతున్నారు అల్లు అరవింద్. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ లో నాగార్జున కూడా పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రాజెక్ట్ పై నమ్మకంతో నాగ్ ఈ సినిమాపై డబ్బు పెట్టడం లేదు.. అసలు విషయమేమిటంటే.. అల్లు అరవింద్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేసిన బడ్జెట్ కంటే ఇంకాస్త ఎక్కువ ఖర్చు అవుతుందట. అయితే అఖిల్ సినిమాపై అంత బడ్జెట్ పెట్టనని,ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని అరవింద్ సూచించాడట.దీంతో నాగార్జున సీన్ లోకి ఎంటర్ అయితే మిగతా బడ్జెట్ను చూసుకుంటానని..నా కొడుకు కి మంచి హిట్టు పడాలని అల్లు అరవింద్ కి సూచించారట నాగార్జున.