"లక్ష్మీస్ ఎన్టీఆర్" కోసం రోడ్డుకెక్కుతున్న వర్మ
ఈమధ్యనే చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో విడుదల చేస్తామని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. విడుదల తేదీ సమీపిస్తుండటంతో ఏపీలో "లక్ష్మీస్ ఎన్టీఆర్ " చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్లో ప్రెస్మీట్ను నిర్వహిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే కొన్ని రాజకీయ ఒత్తిడుల వాళ్ళ నోవొటెల్ వాళ్ళు వర్మ ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేశారు. ఈ విషయంపై మండిపడ్డ వర్మ తన ప్రెస్ మీట్లను ను విజయవాడ పైపుల రోడ్డులో మరియు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద నిర్వహించనున్నట్టు వర్మ ట్విటర్లో తెలిపారు.
. "నోవాటెల్ హోటల్ వాళ్లకు ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో వారు ఈ ప్రోగ్రామ్ క్యానిల్ చేశారు. ఒక వ్యక్తికి భయపడి హోటళ్లు, క్లబ్బులవారు జడిసి పోయారు వారు ఎంత ట్రై చేసినా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నడిరోడ్డుపై జరిగే తన ప్రెస్ మీట్ ను అడ్డుకోలేర" ని ట్విట్టర్ దారా పేర్కొన్నారు.