టీవీ: విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న రష్మి..!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. తనకు వచ్చిరాన్ని తెలుగుతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేకపోయినా రష్మి బుల్లితెర పైన మాత్రం మంచి క్రేజీ అందుకుంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మూగజీవాలను హింసించే వారీ గురించి పోస్ట్ చేస్తూ ఉంటుంది. గతంలో సుధీర్ ,రష్మీ కెమిస్ట్రీతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం సుధీర్ సినిమాలలో బిజీగా ఉండడం వల్ల రష్మీ మాత్రం యాంకర్ గానే చేస్తోంది.

తాజాగా రష్మీ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. అభిమానులతో ముచ్చటించడమే కాకుండా అప్పుడప్పుడు హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది రష్మీ.. తాజాగా రష్మీ తన పుట్టినరోజు జరుపుకున్న ఫోటోలలో  స్నేహితులతో కలిసి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ముఖ్యంగా రష్మీ షేర్ చేసిన ఫోటోలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ముఖ్యంగా మందు గ్లాసు పట్టుకొని ఉన్న ఒక ఫోటో.. అలాగే మరొక ఫోటోలు ఏదో కేక్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. రష్మీ ఈ ఫోటోలను షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారుతోంది.

రష్మీ మందు గ్లాసుతో తన పుట్టినరోజును సైతం గ్రాండ్గా జరుపుకున్నట్టుగా పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది ఎప్పుడు మందు గ్లాసుతోనేనా పెళ్లి చేసుకోవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. గత కొద్దిరోజులుగా రష్మి ఒక పారిశ్రామికవేత్తను త్వరలోనే వివాహం చేసుకోబోతుందని రూమర్ అయితే వినిపిస్తోంది.. ఈ విషయం పైన కూడా రష్మి ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు.. తాజాగా రష్మీ షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.. గతంలో కూడా రష్మి ఇక మీదట సినిమాలలో కనిపించనని కేవలం బుల్లితెర పైన మాత్రమే ఎక్కువగా ఫోకస్ పెట్టుతానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: