కేరళా వరదబాధితుల కోసం విరాళంగా ‘గీతాగోవిందం’షేర్!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘గీతాగోవిందం’. ఈ చిత్రం రిలీజ్ కి వారం రోజుల ముందు నెట్ లో లీక్ కావడంతో ఎన్నో ఇబ్బందులకు గురైంది.  గతంలో పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం కూడా రిలీజ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షం కావడం..రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ కావడం జరిగింది. 

ఇప్పుడు ‘గీతా గోవిందం’ చిత్రం కూడా అదే తరహాలో రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబడుతుంది.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా కేరళలోను భారీస్థాయిలో విడుదలైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ ప్రాంతమంతా అస్తవ్యస్తమైపోయింది. కేరళ వాసులను ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించడానికిగాను ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరోలు విరాళ రూపంలో ఇస్తూ వచ్చారు.  కమల్ హాసన్ రూ.25 లక్షలు, అల్లు అర్జున్ రూ.25 లక్షలు, విజయ్ దేవరకొండ ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు. 

దాంతో ఇప్పుడు గీతాగోవిందం చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 'గీత గోవిందం' నిర్మాత బన్నీవాసు కూడా వరద బాధితులకు విరాళం ప్రకటించాడు. కేరళలో 'గీత గోవిందం' ఎంత షేర్ ను రాబడుతుందో అంతమొత్తాన్ని ఆయన విరాళంగా అందజేయనున్నట్టు చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: