కాస్టింగ్ కౌచ్ పై మోహన్ బాబు అందుకే స్పందించలేదా!

siri Madhukar
ఈ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద దుమారమే చెలరేగుతుంది.  శ్రీరెడ్డి  కొంత కాలంగా కొన్ని ఛానల్స్ లో కాస్టింగ్ కౌచ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రావడం..తర్వాత అర్థనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. దాంతో ఆమెకు మహిళా సంఘాల మద్దతు, జూనియర్ ఆర్టిస్టుల మద్దతు లభించడం..వారి కష్టాలు మీడియా వేధికగా తెలియజేయడం జరిగింది.  ఇదిలా ఉంటే..శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..పవన్ కళ్యానపై అనరాని మాటలు అనడంతో టాపిక్ కాస్త ఎటో వెళ్లింది.  ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కన్నా వ్యక్తిగత అంశాలపై పెద్ద రగడ మొదలైంది. 

శ్రీరెడ్డి విషయంలో వర్మ జోక్యం చేసుకోవడం..వర్మ మాటలకు మెగా ఫ్యామిలీ ఆక్రోశం వెల్లుబుచ్చడం..అది కాస్త కొన్ని మీడియా ఛానల్స్ పై నిషేదం విధించాలని..పవన్ డిమాండ్ చేయడం..ఇలా రోజు రోజు కీ వివాదం పెరిగిపోతుంది.  సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం వివాదం అయినా..వెంటనే మంచు మోహన్ బాబు జోక్యం చేసుకొని మాట్లాడే వారు. కానీ ఇంతకాలం కాస్టింగ్ కౌచ్ పై ఆయన స్పందించకుండా ఉన్నారు. దాంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయానికి వస్తే..ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది.

కొన్నాళ్లుగా మోహన్ బాబు అమెరికాలోనే ఉంటున్నారు. భుజానికి సంబంధించిన మేజర్ మెడికల్ ట్రీట్‌మెంట్ ను ఆయన అక్కడ తీసుకుంటున్నారు. వాస్తవానికి చాలా కాలంగా మోహన్ బాబు రైట్ షోల్డర్ సమస్యతో బాధపడుతున్నారు. అయినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా ఆయన ‘గాయత్రి’ సినిమాలో ఫైటింగ్‌లు చేశారు. దాంతో ఆ నొప్పి కాస్త విపరీతం కావడంతో..ఆయన  సర్జరీ కచ్చితంగా చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తండ్రికి తోడుగా అమెరికా వెళ్లిన విష్ణు కూడా  ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్నారు.  ప్రస్తుతం విష్ణు నటించిన  ‘ఆచారి అమెరికా యాత్ర‌’ ప్ర‌మోష‌న్ల కార్యక్రమాలను  దర్శకనిర్మాతలు కానిచ్చేస్తున్నారు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయికగా న‌టించిగా.. బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: