దుమ్మురేపిన మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు,మంచు మనోజ్, మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చారు.  అయితే మంచు లక్ష్మి నటిగా, బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.  ఇక మంచు విష్ణు,మనోజ్ లో ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటింది.  ఈ ఇద్దరు అన్నదమ్ములు సరైన హిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

 తాజాగా  మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ ‘ఒక్కడు మిగిలాడు’ ట్రైలర్ విడుదలైంది.  భారతదేశంలో ఇంకా స్వాతంత్ర పోరాటం కొనసాగుతూ ఉంటే అల్లూరి, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను మీరు ఏమని పిలుచుకునేవారు? తీవ్రవాదులనా..? లేక దేశభక్తులనా..?  అంటూ.. మొదలై దేశం వర్ధిల్లాలి అంటూ ముగుస్తుంది ట్రైలర్. 

ఇప్పటి వరకూ దాదాపు కామెడి సినిమాలకే పరిమితమైన మనోజ్ ఒక్కసారిగా యాక్షన్ మూవీలో నటించి అదరగొట్టాడు. 1:39నిమిషాల ఒక్కడు మిగిలాడు ట్రైలర్‌ను.. యాన్ అన్ టోల్డ్ ట్రూ స్టోరీ క్యాప్షన్‌తో శనివారం మనోజ్ తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా రిలీజ్ చేశాడు. ఒక పాత్రలో ఎల్టీటీఈ ప్రభాకరన్‌గా మనోజ్‌ నటించినట్లు తెలుస్తోంది.

శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతోంది.  అజయ్‌ ఆండ్రూస్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీకాంత్‌, ఎస్‌ఎన్‌ రెడ్డిలు నిర్మిస్తున్నారు. మనోజ్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: