‘నక్షత్రం’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్..అదేనా కారణం..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో గత మూడు సంవత్సరాల నుంచి పరాజయాన్ని మూటగట్టుకున్న క్రియేటీవ్ దర్శకుడు కృష్ణవంశి..ఇసారి తన చిత్రం బ్లాక్ బస్టర్ చేయాలనే సంకల్పంతో..మల్టీస్టారర్ చిత్రం ‘నక్షత్రం’ తెరకెక్కించారు.  అయితే ఈ చిత్రం షూటింగ్ జరుపుకొని ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే..కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.  ఇక సినిమాపై క్యూరియాసిటీ పెంచేందుకు ఫస్ట్ లుక్ ని ఒక్కో నటులతో రిలీజ్ చేయించారు కృష్ణవంశి.  నక్షత్రం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  

అంతే కాదు ఈ సినిమాలో సాయిధరమ్, ప్రగ్నాజైస్వాల్ కి సంబంధించిన సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.  కృష్ణవంశి అనగానే హీరోయిన్లను తనదైన మార్క్ లో చూపిస్తాడని తెలిసిన విషయంమే..అంతే కాదు సినిమాలో కూడా ఎదో ఒక మెసేజ్ ని తప్పకుండా పెడతారు.  ఈ చిత్రం పోలీస్ వ్యవస్థ గొప్పతనం గురించి తెలియజేసేలా ఉంటుందని..ఓ యువకుడు పోలీస్ కావాలనే తపతో చేసే ప్రయత్నాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని పోలీస్ డ్రెస్ పై ఉన్న నక్షత్రం పవర్ ఏంటో తెలియజెప్పేలా సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.  

ఇక కృష్ణ వంశి డైరెక్షన్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది.  అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా జూలై 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఇప్పుడు ఆగష్టు 4 కు వాయిదా వేశారు. ఈ నెలాఖరున పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్న సందర్భంగా సినిమా వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

అంతే కాదు  ఆగష్టు 4న మరో పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో ఈ వాయిదా సినిమాకు కలిసొచ్చే అవకాశముంది. సందీప్ కిషన్, రెజినాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ లు అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కె. శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌరాలు సంగీతం అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: