తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు స్టార్ హీరోలు అయిన అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కి మంచి క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై చిన్న తరహా నటులు మాత్రమే దర్శనమిచ్చేవారు..కానీ ఈ మద్య ఇండస్ట్రీ టాప్ హీరోలు కూడా ఎంట్రీ ఇవ్వడంతో బుల్లితెరకు మంచి కళ వచ్చిందని సంతోషిస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ‘బిగ్ బాస్’ షో ఈ నెల 16 న రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాద్లో ‘బిగ్బాస్’ షోను లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. నా చిన్నతరంలో టివి షోస్ చూస్తుండే వాడినని..అయితే నాకు సరిగా మాట్లాడటం, టీవీలో హోస్ట్గా ఎలా బిహేవ్ చేయాలని కానీ, ఎలా మాట్లాడాలని కానీ, ఎలా నటించాలని కానీ తెలీదని అంటున్నారు ఎన్టీఆర్. అయితే స్టార్ మా బిగ్బాస్ షోను హోస్ట్ చేయమని చెప్పి నా దగ్గరకు వచ్చిందో.. రెండో నిమిషం కూడా ఆలోచించలేదు.
ఇండస్ట్రీలో నటించడం ఒకఎత్తైతే బుల్లితెరపై నటించడం మరో ఎత్తు. ఇప్పటికే సీనియర్ హీరోలు హోస్ట్ గా వ్యవహరించారు..వారు ఎలా బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించారన్న విషయం స్టడీ చేయాల్సి ఉందని అంటున్నారు. మీకు ఇన్స్ ప్రేషన్ ఎవరన్న ప్రశ్నకు నాకు ఇప్పుడు..ఎప్పుడూ మా తాతగారే అని అన్నారు.
బిగ్బాస్ షోను హోస్ట్ చేయమని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందని..ఐ లైక్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. సో బిగ్బాస్కు హోస్ట్గా చేయడం మరో ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు ఎన్టీఆర్. భారతదేశంలో ఇంత పెద్ద రియాలిటీ షోకు తెలుగులో నన్ను హోస్ట్గా తీసుకున్న స్టార్ మాకు ధన్యవాదాలు.’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ షోకు సంబంధించిన మరో స్టన్నింగ్ ప్రోమోను విడుదల చేశారు.