2017 సగం గడిచింది. అంటే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. గడిచిన ఈ అరునెలల్లో టాలీవుడ్ పగిలిపోయే రికార్డులు సృష్టించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున.. వంటి టాలీవుడ్ టాప్ హీరోలందరి సినిమాలు విడుదలై ఇండస్ట్రీ కళకళలాడింది.
దశాబ్దం విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా దుమ్మురేపింది. మెగా ఫ్యాన్స్లో ఉరిమే ఉత్సాహం నింపిందీ సినిమా. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా కూడా హిట్ టాక్ అందుకుంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన భారీ ప్రాజెక్టు బాహుబలి-2 విడుదలై ఇండియన్ సినిమా రికార్డులన్నీ స్మాష్ చేసింది. ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ స్టామినా ఉందా అంటూ ప్రపంచం నివ్వెరపోయింది. జక్కన్న సృష్టించిన ఈ సినిమా ఇప్పటివరకు 18 వందల కోట్లకుపైగానే కలెక్షన్లు సాధించింది.
ఇక విక్టరీ వెంకటేష్.. గురు సినిమాతో మరో హిట్ కొట్టాడు. నాగార్జున సినిమా ఓం వెంకటేశాయా మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. రీసెంట్గా విడుదలైన అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాథం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్లలో మాత్రం దుమ్మురేపుతోంది.
మొత్తానికి ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్టనే చెప్పాలి. సక్సెస్ రేటు ఎక్కువ ఉంది. కమర్షియల్గా కూడా ఊహించని కలెక్షన్లు రాబట్టుకుంది టాలీవుడ్. మన టాప్ హీరోలందరి సినిమాలు హిట్టయినా, ఫైనల్గా దుమ్మురేపింది మాత్రం ప్రభాసే అని చెప్పకతప్పదు. ఇటు సౌత్లోనే కాక అటు నార్త్లోనూ అదరగొట్టాడు ప్రభాస్.
ఇక సెకండాఫ్లోనూ ఇరగదీసేందుకు టాలీవుడ్ స్టార్లందరూ రెడీ అవుతున్నారు. ఫైనల్గా దుమ్మురేపేదెవరో చూడాల్సిందే.