తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన వారు హీరోలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరోగా మారారు మాస్ రాజ రవితేజ. ఇక అష్టాచమ్మ చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నాని కూడా హీరోగా మారిపోయాడు. ఈ మద్య షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని వచ్చిన రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోగా మారిపోయాడు. తర్వాత వచ్చిన ‘సినిమా చూపిస్తమావా’, ‘కుమారి 21 ఎఫ్’ లాంటి వరుస హిట్స్ తో మంచి సక్సెస్ తో దూసుకు వెళ్తున్నాడు.
హీరోగా చేస్తూనే కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కూడా అదరగొడుతున్నాడు ఈ కుర్రహీరో. తాజాగా రాజ్ తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ‘మజ్ను’ ఫేమ్ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు. తాజాగా ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మార్చ్ 3న రిలీజ్ చేస్తున్నారు.