మనీ: మీ డబ్బును రెట్టింపు చేసే సరైన పథకం..!

Divya
ఈరోజుల్లో చాలామంది డబ్బు సేఫ్టీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ నష్టం రాకూడదని భావించేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ అన్నింటికన్నా ముఖ్యం అనుకునే వారికి సరైన పెట్టుబడి ఎంపిక అని చెప్పుకోవాలి. అదే ప్రభుత్వ గ్యారెంటీ కలిగిన కిసాన్ వికాస్ పత్ర. కిసాన్ వికాస్ పత్ర ఇదొక చిన్న పొదుపు పథకం. దీనిలో సేవింగ్స్ చేయడం వల్ల మీ సొమ్మును మీరు రెట్టింపు చేసుకోవచ్చు. ఈ పథకం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాల ద్వారా సర్టిఫికెట్ రూపంలో అందించబడుతోంది. ఇది ఒక ఫిక్స్డ్ రేటు కలిగిన సేవింగ్స్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ సొమ్ము మొత్తం 124 నెలల్లో రెట్టింపు అవుతుంది.
ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్రా పథకంలో 6.9% వడ్డీ రేటు అందించబడుతోంది. ఈ పథకంలో కనీసం 1000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. దీనికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. ఈ పథకం కింద ఎవరైనా పెద్దలు లేదా మైనర్ బాలబాలికుల తరఫున సంరక్షకులు అంటే వారి తల్లిదండ్రులు కూడా ఈ ఖాతా ను తెరవచ్చు. ఇక మైనర్ కు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఖాతా అతని పేరు మీదకు మారుతుంది.  ఇది కాకుండా ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో జాయింట్ ఖాతా కూడా తెరిచే అవకాశం ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రా పథకంలో ఖాతా తెరవడానికి ఏ పత్రాలు అవసరమవుతాయి అంటే..
కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరడానికి ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ రుజువు , కేవీపీ దరఖాస్తు ఫారం, పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు సదరు వ్యక్తి మొబైల్ నెంబర్ అలాగే వయసు ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుంది.  సమీపంలోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి వినియోగదారులు కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరవచ్చు. కెవిపి దరఖాస్తు ఫారం ను నగదు, చెక్, పే ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. పెట్టిన మీ డబ్బు కచ్చితంగా రెట్టింపు అవుతుంది పైగా సెక్యూరిటీ కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: