వామ్మో.. రూ.200 తో రూ.10 లక్షలు సంపాదించింది ఈమెనే?

praveen
ఇటీవలి కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ ప్రతి ఒకరికి ఉంది. ఇది మనుషుల్లో ఉండే సహజసిద్ధమైన ఆలోచన అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం స్టాక్ మార్కెట్లను ఎంచుకొని అందులో పెట్టుబడి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్లు కూడా కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. కొంతమందికి మాత్రం అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి ఏకంగా లక్షలు, కోట్ల రూపాయల సంపాదిస్తూ ఉంటారు.

 ఇక ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో తెర మీదికి వచ్చి ఎంతో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాయ్. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ మహిళ ఏకంగా 200 రూపాయలతో 10 లక్షల రూపాయలు సంపాదించింది. ఇది వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది కదా.. అంతేకాకుండా ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యం కూడా వేస్తోంది కదా.. ఇక ఈ విషయం పై ఫుల్ క్లారిటీ రావాలంటే మాత్రం కాస్త వివరాల్లోకి వెళ్ళాల్సిందే. మధ్యప్రదేశ్లోని పన్నా కు చెందిన చమేలి బాయి కృష్ణ అనే ఒక మహిళ కళ్యాణ్ పూర్ బెల్ట్ లో ఉన్న ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం లీజుకు తీసుకుంది.

 అయితే ఆ భూమిలో విలువైన వజ్రాలు దొరుకు తుంటాయి అని స్థానికులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఎంతో కష్టపడి మూడు నెలల పాటు తవ్వకాలు జరిపింది సదరు మహిళ. చివరికి ఆమె కష్టానికి ప్రతిఫలం లభించింది. ఊహించని విధంగా అదృష్టం తలుపు తట్టింది. సుమారు 12 లక్షల విలువ చేసే 2.08 క్యారెట్ల వజ్రం ఆమెకు తవ్వకాల్లో దొరికింది. అది బ్రైడ్ డైమండ్ కావడంతో ఆమె దశ తిరిగిపోయింది అని చెప్పాలి. ఇక ఆమె ఆదాయమెంత ప్రభుత్వానికి అందజేయగా ఆమెకు అన్ని టాక్స్ లు పోయి ఎనిమిది లక్షల  అందుకుంది. కాగా సదరు మహిళ ఆ భూమిని రెండు వందల రూపాయలకు లీస్ కు తీసుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: