మనీ: 15 యేళ్లలో ఇలా చేస్తే కోటీశ్వరులు అవ్వొచ్చు..!

Divya
సాధారణంగా మన భవిష్యత్తు అవసరాలు తీరాలన్నా లేదా కుటుంబం ఆర్థిక భద్రత కావాలి అన్నా ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చాలా మంది నెలవారీ ఆదాయంలో కొంత డబ్బులు ఇతర మార్గాల ద్వారా భవిష్యత్ తరాల కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇన్వెష్ట్ చేయడం వల్ల మనకు ఎక్కువ లాభాలు వస్తాయి అనే విషయాన్ని ముందుగా చెక్ చేసుకుని, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తు తరాలలో ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. ఒకవేళ సరైన మార్గంలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయలేకపోతే కష్టాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడం వల్ల పదవీవిరమణ అయ్యేసరికి కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు.
మీ డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడమే బెస్ట్ ఆప్షన్.. రిస్కుతో కూడిన పని అయినప్పటికీ జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం వల్ల అత్యధిక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మ్యుచువల్ ఫండ్స్ లో  మీరు 15-15-15 ఫన్నీ రూల్ ను ఆధారంగా చేసుకుని పెట్టుబడులు పెట్టడం వల్ల సులభంగా కోటీశ్వరులు అవ్వచ్చు..
ఈ కొత్త రూల్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా..? దీని ప్రకారం మీరు ప్రతి సంవత్సరం 15 శాతం రాబడిని అంచనా వేసుకోవచ్చు..15-15-15 రూల్ విషయానికి వస్తే , మూడూ  వరుసగా వృద్ధిరేటు ,కాలవ్యవధి, నెలవారీగా పొదుపు ఎంత చేయాల్సి ఉంటుంది.. అనే మొత్తాన్ని సూచిస్తుంది.. అంటే ఉదాహరణకు మీరు 15% రాబడి అంచనాతో దాదాపు పదిహేను సంవత్సరాలలో ఒక కోటి రూపాయలకు చేరుకోవడానికి, మీరు ప్రతి నెల 15 వేల రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పదిహేను సంవత్సరాలలో మీరు 15% గనుక రాబడిని అంచనా తో పెట్టుకుంటే కోటి రూపాయల లక్ష్యాన్ని సాధించ గలుగుతారు.
ఇక మార్కెట్ పరిస్థితిని అనుసరించి పెట్టుబడి పెట్టడం వల్ల అతి తక్కువ సమయంలో ని అనగా కేవలం 15 సంవత్సరాల లోనే కోటి రూపాయలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: