మనీ: 15 యేళ్లలో ఇలా చేస్తే కోటీశ్వరులు అవ్వొచ్చు..!
మీ డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడమే బెస్ట్ ఆప్షన్.. రిస్కుతో కూడిన పని అయినప్పటికీ జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం వల్ల అత్యధిక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మ్యుచువల్ ఫండ్స్ లో మీరు 15-15-15 ఫన్నీ రూల్ ను ఆధారంగా చేసుకుని పెట్టుబడులు పెట్టడం వల్ల సులభంగా కోటీశ్వరులు అవ్వచ్చు..
ఈ కొత్త రూల్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా..? దీని ప్రకారం మీరు ప్రతి సంవత్సరం 15 శాతం రాబడిని అంచనా వేసుకోవచ్చు..15-15-15 రూల్ విషయానికి వస్తే , మూడూ వరుసగా వృద్ధిరేటు ,కాలవ్యవధి, నెలవారీగా పొదుపు ఎంత చేయాల్సి ఉంటుంది.. అనే మొత్తాన్ని సూచిస్తుంది.. అంటే ఉదాహరణకు మీరు 15% రాబడి అంచనాతో దాదాపు పదిహేను సంవత్సరాలలో ఒక కోటి రూపాయలకు చేరుకోవడానికి, మీరు ప్రతి నెల 15 వేల రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పదిహేను సంవత్సరాలలో మీరు 15% గనుక రాబడిని అంచనా తో పెట్టుకుంటే కోటి రూపాయల లక్ష్యాన్ని సాధించ గలుగుతారు.
ఇక మార్కెట్ పరిస్థితిని అనుసరించి పెట్టుబడి పెట్టడం వల్ల అతి తక్కువ సమయంలో ని అనగా కేవలం 15 సంవత్సరాల లోనే కోటి రూపాయలను పొందవచ్చు.